ఆయన నాటకంపై మక్కువతో ఆ రంగంలో అడుగుపెట్టారు. పదకొండో ఏటే ఓ నాటక సంఘం స్థాపించి సంచలనం సృష్టించారు. ఈ రంగంలో రాణించడంతో జంద్యాల దృష్టిలో పడి సినీ రంగ ప్రవేశం చేశారు. తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నేడు అనారోగ్యం కుంగదీస్తున్నప్పటికీ రంగస్థలంలో దర్శకుడిగా రాణిస్తున్నారు ప్రముఖ రంగస్థల, సినీ నటుడు విద్యాసాగర్. నాటకంపై ఉన్న మమకారంతో తిరుపతిలో జరుగుతున్న నంది నాటకోత్సవాలను తిలకించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి.
ప్ర : రంగస్థల ప్రవేశం ఎలా జరిగింది.
జ: మా సొంతూరు గుంటూరు. నాకు ఎనిమిదేళ్ల ప్రా యంలో మా ఊళ్లో ఆంధ్ర బాలానందం సంఘం వ్యవస్థాపకుడు రేడియో అన్నయ్య(జ్ఞాపతి రాఘవరావు) చిన్నపిల్లలతో ‘బుజి బుజి రేకుల పిల్లుందా’ మ్యూజికల్ బేరె(డ్రామా) ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారు. అందులో నాకో చిన్న పాత్ర దక్కడంతో మొదలైంది రంగస్థల ప్రవేశం.
ప్ర: ఏదో సంస్థకు పోటీగా బ్యా నర్ పెట్టారని తెలిసింది.
జ : మ్యూజికల్ బేరెలో పెళ్లికొడుకు పాత్ర ఇవ్వమని రేడియో అన్నయ్యను అడిగాను. ఆయన అదిగో ఇదిగో అంటూ ఇవ్వలే దు. దీంతో ఆంధ్రా బాలానందం సంస్థకు పోటీగా నేను 11 ఏటనే శ్రీవెంకటేశ్వర బాలానందం సంఘం స్థాపించాను. మా ఇంటి చుట్టు పక్క ఉన్న పిల్లలతో కలిసి డ్రామాలు వేశాం. రేడియో అన్నయ్య పాత్ర ఇవ్వలేదన్న కసే నన్ను ఇంతవాణ్ణి చేసింది.
ప్ర : సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది.
జ: 1984లో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీ ల్లో ‘లిఫ్ట్’ అనే నాటికను ప్రదర్శించాం. సినీ దర్శకులు జంద్యాల, ఉషాకిరణ్ మూవీస్ మేనేజర్ అట్లూరు రామారావు ఆ పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఆ ప్రదర్శనకు విశేష స్పందన రావడంతో జంద్యాల దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీ స్ మొదటి సినిమా ‘శ్రీవారికి ప్రేమలేఖ’లో అవకాశం ఇచ్చారు.
ప్ర : కేవలం నటనతోనే సరిపెట్టారా?
జ : నా జీవితమనే నాటకంలో బ్యాంకు ఉద్యోగిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, కోడెరైక్టర్గా ఇలా పలు పాత్రలు పోషిం చాను. ఇప్పటి వరకు 102 సినిమాల్లో నటించాను. ఎస్వీ కృష్ణారెడ్డి డెరైక్షన్లో బాలకృష్ణ నటించిన టాప్హీరో నా ఆఖరు సినిమా. దర్శకుడిగా అవకాశం వచ్చే సమయంలో 1994లో పక్షవాతం రావడంతో సినీ రంగానికి దూరమయ్యాను. అయితే మాతృరంగాన్ని మాత్రం వీడలేదు.
ప్ర : నేటి రంగస్థల నటులకు మీ సూచనలు?
జ : ఒకప్పట్లో టీవీ వంటి మాధ్యమాలు లేకపోవడంతో నాటక రంగానికి విశేషాదరణ ఉండే ది. దీంతో నాటకమే ఊపిరి, శ్వాసగా జీవించేవాళ్లు. అయితే ఇప్పుడు కొత్తగా నటనారంగంలోకి వస్తున్న వారికి కమిట్మెంట్ కొరవడింది. వచ్చిన రెండ్రోజులకే నంది అవార్డు వస్తుందా? సినిమా, టీవీలో అవకాశాలు ఇప్పిస్తారా? అని అడుగుతున్నారు. ఏదైనా ఒక కళను నమ్ముకుంటే అదే శ్వాస, ధ్యాస కావాలి. అప్పుడే ఆ కళలో గుర్తింపుతోపాటు అగ్రస్థానం దక్కుతుంది.
కళే శ్వాస..ధ్యాస
Published Fri, Jan 22 2016 8:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement