పల్లెల్లో పంజా విసురుతున్న జ్వరం | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పంజా విసురుతున్న జ్వరం

Published Fri, Aug 12 2016 9:39 PM

viral feavour in begalur

  • బెగలూరులో రక్తకణాలు తగ్గి ముగ్గురి పరిస్థితి విషమం
  • కాళేశ్వరం: మారుమూలు పల్లెల్లో జ్వరాలు పంజా విసురుతున్నాయి. మహదేవపూర్‌ మండలం బెగలూరులో అస్వస్థతతో ఇంటికొకరు మంచంపడుతున్న తీరు స్థానికుల్లో కలవరం రేపుతోంది. గ్రామానికి చెందిన కారు లక్ష్మి, కారు శ్రీనివాస్, కారు సమ్మయ్య అనే వ్యక్తులకు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండడంతో రక్తకణాలు పూర్తిగా తగ్గిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున క్లస్టర్‌ ఎస్పీహెచ్‌వో సమియోద్దీన్‌ మహదేవపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ గ్రామంలో ఇప్పటికే ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరోవైపు సుబ్బరాజు, విజయలక్ష్మి అనే దంపతులు డెంగీ లక్షణాలతో వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.

     

Advertisement
Advertisement