Sakshi News home page

మధుకర్‌రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరణ

Published Tue, Feb 28 2017 1:11 AM

vital information from madhukar reddy

ధర్మవరం అర్బన్‌: పోలీసు కస్టడీలో ఉన్న అంతర్‌రాష్ట్ర ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డి నుంచి ధర్మవరం పట్టణ పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు నాలుగురోజులపాటు ఇతడిని కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం మధుకర్‌రెడ్డి నుంచి సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. ఏటీఎం దొంగ మధుకర్‌రెడ్డి ధర్మవరంలో 2013 నవంబర్‌ 10న చంద్రబాబు నగర్‌కు చెందిన ప్రమీలమ్మను హత్య చేసి, ఆమె వద్దనున్న 2 ఏటీఎంలు, జత కమ్మలను ఎత్తుకెళ్లాడు.

అప్పట్లో హత్య కేసు నమోదైంది. ఆ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారించారు. ఇంకా పలు  కేసులను మధుకర్‌రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. బెంగళూరు నగరంలో ఎక్కువగా ఏటీఎంలలో దోపిడీలు చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.  ఇంకా మూడురోజులపాటు మధుకర్‌రెడ్డిని ధర్మవరం పట్టణ పోలీసులు విచారించనున్నారు. దీంతో మధుకర్‌రెడ్డి చేసిన మరిన్ని నేరాలు బయటపడే అవకాశం ఉంది.  

Advertisement
Advertisement