రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

Published Fri, Dec 9 2016 11:08 PM

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

అల్లూరు (పిట్టలవానిపాలెం): రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు అల్లూరు మంతెన సత్యనారాయణరాజు జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల పిఈటీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అండర్‌ 17 వాలీబాల్‌ బాలికల విబాగంలో  ఎ జీవననాగజ్యోతి, పి.భవాని (స్టాండ్‌బై ), వాలీబాల్‌ అండర్‌ 14 బాలికల విబాగంలో  పి సదా,ఎ లీలా మాధవి , ఎస్‌కె ఫాతిమా (స్టాండ్‌బై )లు ఎంపికైనట్లు తెలిపారు. అండర్‌ 14 బాలుర విబాగంలో  ఎన్‌హర్షవర్దన్‌ రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు (స్టాండ్‌బైగా )  ఎంపికైనట్లు తెలిపారు. వీరు ఈనెల 8వ తేదీన నరసరావుపేటలో జరిగిన  ఖేల్‌ఇండియా జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికైయ్యారని తెలిపారు.

Advertisement
Advertisement