ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ | Sakshi
Sakshi News home page

ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ

Published Sun, Nov 6 2016 10:25 PM

ముగిసిన ఓటరు నమోదు ప్రక్రియ - Sakshi

– 2.44 లక్షలు మంది పట్టభద్రులు దరఖాస్తు
– 21,856 మంది ఉపాధ్యాయులు ఓటరు నమోదు
– 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
– 23 నుంచి డిసెంబర్‌ 8 వరకు అభ్యంతరాలు స్వీకరణ
– తుది జాబితా డిసెంబరు 30న ప్రచురణ


అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ ఈ నెల 5వ తేదీతో ముగిసినట్లు ఎలక్ట్రోల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి తెలిపారు. ఇందుకు సంబం«ధించిన వివరాలను డీఆర్‌ఓ ఆదివారం వెల్లడించారు.  ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి పట్టభద్ర ఓటర్లుగా 2,44,354 మంది నమోదు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఓటర్లుగా 21,856 మంది నమోదు చేసుకున్నారు.

23 నుంచి అభ్యంతరాలు స్వీకరణ
     ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 23న ప్రకటిస్తారు. క్లెయిములు, అభ్యంతరాలను ఆరోజు నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు స్వీకరిస్తారు. వాటిని 26వ తేదీలోపు పరిష్కరిస్తారు. తుది ఓటర్ల జాబితా డిసెంబరు 30న ప్రచురిస్తారు.

పట్టభద్ర ఓటరు నమోదు ఇలా
జిల్లా    ఆన్‌లైన్‌ ద్వారా     కార్యాలయాల్లో     మొత్తం    
వైఎస్‌ఆర్‌ కడప    38,270    38,083    76,353    
అనంతపురం        42,828    41,369    84,197    
కర్నూలు        36,363    47,441    83,804    
మొత్తం        1,17,461    1,26,893    2,44,354    
    
ఉపాధ్యాయ ఓటరు నమోదు ఇలా
జిల్లా    ఆన్‌లైన్‌ ద్వారా     కార్యాలయాల్లో     మొత్తం    
వైఎస్‌ఆర్‌ కడప    1,629    5,094    6,723    
అనంతపురం     2,702    5,241    7,943    
కర్నూలు          1,768    5,422    7,190    
మొత్తం        6,099    15,757    21,856   

Advertisement

తప్పక చదవండి

Advertisement