వైద్యం వికటించి బాలింత మృతి | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి బాలింత మృతి

Published Sat, Aug 13 2016 11:17 PM

మృతురాలు సమీరా

ఖమ్మం మామిళ్లగూడెం: స్టేషన్‌ రోడ్డులోని లుంబిని ఆస్పత్రికి ప్రసవానికొచ్చిన మహిళ సమీరా(20) మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. సమీరా తల్లి ఆయేషా చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం ప్రకాశ్‌నగర్‌కు చెందిన మార్బుల్‌ల్లో పనిచేసే అక్రం భార్యను శుక్రవారం డెలివరీ కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలొ శనివారం   డాక్టర్లు ఆపరేషన్‌ చేసి కుట్లు వేశారు. రక్తహీనత ఉండటంతో రక్తం ఎక్కించారు. కాని వైద్యం వికటించి సమీరా మృతి చెందింది.  పాపా క్షేమంగా ఉంది. సమీరా మృతితో బంధువుల రోధన కలిచివేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement