జల దిగ్బంధంలో బీర్సెట్టిపల్లి గ్రామం | Sakshi
Sakshi News home page

జల దిగ్బంధంలో బీర్సెట్టిపల్లి గ్రామం

Published Thu, Sep 15 2016 6:21 PM

water blockade at Birsettipalli village

రంగారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి కురుస్తున్న వానకు పలు గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. తాండూరు మండలం గోనూర్ పంచాయతీ బీర్సెట్టిపల్లి గ్రామం జల దిగ్బంధానికి గురయింది. గ్రామానికి రెండు వైపులా ఉన్న వాగులు పొంగిపొర్లడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం మేకలను మేపేందుకు వెళ్లి వరద నీటిలో చిక్కుకున్న నర్సప్ప, సుశీలమ్మ అనే కాపరులను గురువారం ఉదయం గ్రామస్తులు రక్షించారు.

 

Advertisement
Advertisement