మడ్డువలస గేట్లు ఎత్తివేత | Sakshi
Sakshi News home page

మడ్డువలస గేట్లు ఎత్తివేత

Published Mon, Sep 12 2016 11:39 PM

నీటిని విడిచిపెడుతున్న దృశ్యం

వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద సోమవారం నాలుగుగేట్లు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల్లో నీటిప్రవాహం భారీగా పెరిగింది. దీంతో 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.25 మీటర్ల లెవెల్‌ నీటిమట్టం నమోదైంది. దీంతో ప్రాజెక్టు వద్ద నాలుగే గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నామని డీఈ జి.పద్మజ సాక్షికి తెలిపారు. వరద ఉద్ధృతి పెరిగితే మరిన్ని గేట్లు ఎత్తి నీటిని మళ్లిస్తామని ఆమె తెలిపారు. 
 

Advertisement
Advertisement