Sakshi News home page

‘నీళ్ల’టాస్!

Published Sat, Oct 24 2015 2:36 AM

‘నీళ్ల’టాస్! - Sakshi

గెలిచిన వారికే  ముందు సాగునీరు

 కల్లూరు: క్రికెట్‌లో టాస్ వేసి బ్యాటింగ్ ఎవరు ఎంచుకోవాలో నిర్ణరుుస్తారు. ఇక్కడ మాత్రం టాస్ వేసి గెలుపొందిన వారికి సాగునీరు అందిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో శుక్రవారం నెలకొంది. మండలానికి చెందిన రైతులు ఉబ్బన వెంకటరత్నం, ఎస్‌కే.సుభాని, వి.వేణుబాబు, బాబుల్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి  కాలువకు మోటారు పెట్టి పదెకరాలు సాగు చేసుకుంటున్నారు. శుక్రవారం సాగునీరు కల్లూరు సబ్ డివిజన్‌కు చేరింది. అప్పటికే ఉబ్బన వెంకటరత్నం, సుభానీలకు చెందిన వరి పొలాలు ఎండిపోయాయి.

కాలువ నీటిని పంటకు మళ్లించుకుందామంటే ఎవరికి ముందు నీరు పెట్టాలనే విషయంపై ఈ రైతులు కలిసి టాస్ వేసి నిర్ణయించుకున్నారు. ఉబ్బన వెంకటరత్నం టాస్ గెలువగా.. సాగునీరు ముందు ఆ రైతుకు దక్కాయి. రైతులు సాగునీటి కోసం పడుతున్న పాట్లు ఇలా ఉన్నారుు.

Advertisement
Advertisement