► కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్
► రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని చిన్న, మధ్యతరహా మిషన్ కాకతీయ చెరువుల ద్వారా ఆయా ప్రాజెక్టులు, ట్యాంకుల పరిధిలోని చివరి గ్రామాల రైతులకు కూడా సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల శాఖ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బజార్హత్నూర్, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల వద్ద చేపట్టిన పనులను సమీక్షించారు. ఈ ఏడాది పూర్తి చేసిన మిషన్ కాకతీయ చెరువుల ద్వారా గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలు సాగు కానుందో తెలుపాలన్నారు. ఆయా గ్రామాల్లో సాగునీరు విడుదల చేసేముందు రైతులకు టాంటాం ద్వారా తెలుపాలన్నారు. జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు.
రెవెన్యూ అంశాలపై సమీక్ష
అనంతరం రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. అధికారులు జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రధానంగా నీటి పన్నును స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వసూలు చేయాలన్నారు. గ్రామాలవారీగా జమాబందీ, క్రాప్ బుకింగ్, సాదాబైనామా కేసులు పరిష్కరించాలన్నారు. 2015-16 ఏడాదిలో పహణీలు అప్లోడింగ్ చేసి 100శాతం ఆధార్ నమోదు చేయాలని, అర్హత గల రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలని, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అర్హులకే వర్తింపజేయూలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూములపై రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సర్వే పూర్తి చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సమస్యలు తెలుసుకుని తహసీల్దార్లకు అందించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు.
దళితబస్తీ పథకం అమలులో ఇతర జిల్లాల కంటే ఆదిలాబాద్ను ముందంజలో ఉంచడానికి కృషి చేయాలన్నారు. ఈ పథకం కింద ఇంకెంతమందికి భూమి పంపిణీ చేయాల్సి ఉందో గ్రామాల వారీగా వివరాలు సేకరించి అందించాలని దళిత అభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు. జేసీ కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ సుశీల్, జేడీఏ ఆశాకుమారి, డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.
చివరి భూములకూ నీరందిస్తాం
Published Wed, Nov 23 2016 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement