సమస్యల పరిష్కారానికి కృషి | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి కృషి

Published Fri, Aug 26 2016 11:21 PM

: స్టేషన్‌తండాలో సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల : గ్రామాలు, తండాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం గొల్లపల్లిలోని ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు బాలవర్ధన్‌గౌడ్‌ తదితరులు మంత్రికి స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం స్టేషన్‌తండాలో టీఆర్‌ఎస్‌ జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా తండాలో నెలకొన్న  సమస్యలను మంత్రి దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన అక్కడే ఉన్న ఏడీఈ తావుర్యానాయక్‌తో మాట్లాడి విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కొత్త స్తంభాలతోపాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీరోడ్లు తదితర సమస్యలు తీరుస్తామన్నారు. అనంతరం ఆయన బాదేపల్లిలోని బంగారుమైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
 

Advertisement
Advertisement