హన్మకొండ అర్బన్ : తల్లిపాల వారోత్సవాల పేరుతో వారం పాటు కార్యక్రమాలు అంగన్వాడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇది అంగన్వాడీ కార్యకర్తలకు నిరంతర ప్రక్రియ అని ఐసీడీఎస్ హన్మకొండ రూరల్ సీడీపీఓ శైలజ అన్నారు. కలెక్టరేట్లోని కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన ప్రాజెక్టు సమావేశంలోఆమె మాట్లాడుతూఅంగన్వాడీలు నిత్యం లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సరైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఆహారం తప్పనిసరిగా కేంద్రంలోనే తినే విధం గా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలోనే ఆహారం ఇవ్వాలని వారి బంధువులకు ఇచ్చి హాజరు వేసుకోవడం మానుకోవాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ కార్యకర్త ఆయా అందుబాటులో ఉండాలన్నారు. ఇటీవల శాసనసభా కమిటీ జిల్లాకు వచ్చిన సందర్భంగా వీరి పరిశీలనలో పనితీరు బాగున్నట్లు తేలిందని సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. వివిధ సెక్టార్ల సూపర్వైజర్లు, ఏసీడీపీఓతో పాటు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
తల్లిపాల వారోత్సవాలు నిరంతర ప్రక్రియ
Published Thu, Aug 11 2016 11:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
పరిస్థితి విషమించి యువకుడు..
అవినీతి ‘కాలువ’
తప్పక చదవండి
Advertisement