బేస్‌బాల్‌ పోటీల్లో జిల్లా హవా | Sakshi
Sakshi News home page

బేస్‌బాల్‌ పోటీల్లో జిల్లా హవా

Published Sun, Aug 14 2016 11:14 PM

బేస్‌బాల్‌ పోటీల్లో జిల్లా హవా

పెదపాడు :  రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ సబ్‌ జూనియర్‌  పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బాలుర జట్టు విజేతగా నిలిచింది. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బేస్‌బాల్‌ రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు మరడాని అచ్యుతరావు ఆధ్వర్యంలో ఈ పోటీలను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆదివారంతో పోటీలు ముగిశాయి. ఫైనల్స్‌లో చిత్తూరు జట్టుపై పశ్చిమ గోదావరి జిల్లా జట్టు 4–2 స్కోర్‌ తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు 14–2 స్కోర్‌తో విజయం సాధించింది. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బేస్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జనరావు, కార్యదర్శి ఎంవిఎస్‌ ప్రసాద్, ట్రజరర్‌ ఎస్‌.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
 

Advertisement
Advertisement