సాక్షి, గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ దీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటిస్తున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులో సోమవారం దీక్షా శిబిరం వద్ద పలువురు మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రాణాలను పణంగా పెట్టి జగన్ దీక్ష చేస్తుంటే సిగ్గులేని టీడీపీ మంత్రులు ఇష్టానుసారంగా మా ట్లాడుతున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కేంద్రం ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జగన్ చేస్తున్న దీక్షపై మంత్రులు అవహేళనగా మాట్లాడటం సిగ్గుచేటని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు.
దీక్షకు పార్టీలకతీతంగా మద్దతు పలకాలన్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. పరిస్థితులు విషమించకముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న ఉద్యమాన్ని ఒక వ్యూహం ప్రకారం అణచి వేయాలని సీఎం చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ప్రజలను మోసగిస్తున్న బీజేపీ, టీడీపీలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు.
ప్రత్యేక హోదా సాధించకపోతే టీడీపీ సర్కారును భావితరాలు క్షమించవని పార్టీ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. జగన్పై చేసిన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా 67 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తామని లేకుంటే మీరంతా రాజీనామా చేస్తారా అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మంత్రులకు సవాల్ విసిరారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదాపై 22వ తేదీలోగా ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు.
దీక్షా వేదికపై ఎవరేమన్నారు?
Published Tue, Oct 13 2015 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement