చెన్నూరు: కడప నగర శివారులో ఓ యువతిని ఐదు రోజుల క్రితం దారుణంగా హత్య చేసి, దహనం చేశారు. ఇప్పటి వరకు ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించలేకపోయారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. హంతకులకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించక పోవడంతో పోలీసులకు సవాల్గా మారింది. పలు విధాలుగా దర్యాప్తు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. హంతకులు పక్కా పథకం ప్రకారం, పకడ్బందీగా ఈ హత్య చేశారు. బుధవారం హత్య జరగ్గా, గురువారం వెలుగులోకి వచ్చింది. క్లూస్టీం, డాగ్స్క్వాడ్లు ఆనవాళ్ల కోసం పరిశీలన చేసినా ప్రయోజనం లేకపోయింది.
హత్య కాబడ్డ యువతి ఎవ్వరూ ?
చెన్నూరు పోలీస్స్టేషన్ పరిధిలోని అగ్రిగోల్డ్ వెంచర్లో ఆ యువతి దారుణ హత్యకు గురైంది. జిల్లాలోని పోలీస్స్టేషన్లన్నింటికీ హతురాలి వయస్సు (సుమారు 21) ఆధారంగా సమాచారం అందించారు. హంతకులు ఆమె తలపై రాడ్డుతో బలంగా కొట్టి చంపి ఓ వాహనంలో సంఘటనా స్థలానికి తెచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు. జిల్లాతోపాటు పక్క జిల్లాల్లో నెల రోజులుగా కనిపించని యువతులెవరైనా ఉన్నారా అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
హంతుకులెవ్వరో ?
హంతకులు కరుడు కట్టిన నేరస్తులే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నగరానికి చెందిన వారై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యా స్థలాన్ని పరిశీలిస్తే మద్యం సేవించి, నింపాదిగా కాల్చి, ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకొన్నారంటే సామాన్యులతో అయ్యే పని కాదంటున్నారు. పెట్రోల్ పోసి అంటించారు కాబట్టి.. సమీపంలోని టోల్ ప్లాజా, వాహనాల తనిఖీల కోసం ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్ట్ వద్ద ఉన్న వారికి మంటల వెలుతురు, పొగైనా కనిపించే అవకాశం ఉండవచ్చు. పెట్రోల్ బంకుల వద్ద బాటిళ్లలో పెట్రోలు ఎవరు పోయించుకున్నారనే వివరాలిచ్చేందుకు జాప్యం జరుగుతోంది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తేనే మిస్టరీని ఛేదించవచ్చు. ఈ విషయంపై చెన్నూరు ఎస్ఐ వినోద్కుమార్ను వివరణ అడగగా.. ఈ కేసుపై ప్రత్యేక దష్టి పెట్టామని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని చెప్పారు.
ఆ యువతి ఎవరు..!
Published Mon, Oct 24 2016 12:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement