మహబూబ్నగర్ న్యూటౌన్ : చిన్నచింతకుంట, ఆత్మకూర్, అమరచింత మండలాలను మహబూబ్నగర్ జిల్లాలోనే కొనసాగించాలని బీజేపీ ఓబీసీమోర్చా జిల్లా అధ్యక్షుడు నంబిరాజు కోరారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనతో భవిష్యత్తులో నీటి కొట్లాటలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. తాగునీటికి పాలమూరు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశముందన్నారు.
ఎలాంటి సమస్యలు ఎదురవకుండా ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈనెల 14న లాల్కోట వద్ద హైవే దిగ్బంధం చే యనున్నామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు కుర్వ రమేశ్, దళితమోర్చా నాయకుడు దశరథ్, కిసాన్మోర్చా నాయకులు మహేశ్, ఆర్.అంజన్న పాల్గొన్నారు.