'అవసరమైతే దేవుడ్నే ఎదురిస్తా' | Sakshi
Sakshi News home page

'అవసరమైతే దేవుడ్నే ఎదురిస్తా'

Published Wed, Feb 17 2016 6:57 PM

'అవసరమైతే దేవుడ్నే ఎదురిస్తా'

రాజమండ్రి: బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునే కాదు.. అవసరమైతే దేవుడినైనా ఎదురిస్తా' అని ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య ఘాటుగా విమర్శించారు. బుధవారం ఆయన రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడారు.

రాజకీయ లబ్ది కోసం కేంద్ర, రాష్ట్రాలు రిజర్వేషన్ల పవిత్రతను చెడగొడుతున్నాయని మండిపడ్డారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ వచ్చే వరకు పోరాడుతామని ఆర్‌ కృష్ణయ్య స్పష్టం చేశారు.
 

Advertisement
Advertisement