2019 ఎన్నికల్లో పోటీ చేయను: జేసీ | Sakshi
Sakshi News home page

2019 ఎన్నికల్లో పోటీ చేయను: జేసీ

Published Tue, Oct 18 2016 12:47 PM

Will not contest the next elections, says MP JC diwakar reddy

అనంతపురం : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ అనంతపురం నగర అభివృద్ధికి కావాలనే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నగరంలో రోడ్ల విస్తరణకు సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని జేసీ అన్నారు. అయినప్పటికీ నగరంలో రోడ్డు విస్తరణ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నా ఎలాంటి ఉపయోగం ఉండదని జేసీ అభిప్రాయపడ్డారు. కాగా రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నట్లు ఆయన గతంలో చాలాసార్లు చెప్పిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement