మంటల్లో మాడిపోయిన మహిళ మృతదేహం | Sakshi
Sakshi News home page

మంటల్లో మాడిపోయిన మహిళ మృతదేహం

Published Fri, Mar 10 2017 10:41 PM

మంటల్లో మాడిపోయిన మహిళ మృతదేహం

కదిరి అర్బన్‌ : కదిరి-అనంతపురం మార్గంలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయానికి వెళ్లే దారిలో కల్వర్టు కింద ఓ గుర్తు తెలియని మహిళ(40)  మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు. మంటల్లో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. ఘటనను బట్టి చూస్తే తెల్లవారుజామున జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

విషయం తెలిసిన వెంటనే కదిరి, నల్లమాడ సీఐలు శ్రీనివాసులు, శివరాం, కదిరి, పట్నం ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, రాఘవేంద్ర, వీఆర్‌ఓ మనోహర్‌ అక్కడికి చేరుకున్నారు. సదరు మహిలను ఎక్కడో హత్య చేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి పెట్రోల్‌ పోసి కాల్చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే హత్యకు గురైన మహిళ ఎవరు, ఎందుకు హత్య చేశారు, హంతకులు ఎవరు అనే వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement