Sakshi News home page

భర్త దుబాయ్‌లో.. భార్య అనుమానాస్పద మృతి

Published Mon, Apr 10 2017 9:56 AM

woman suspicious death in siddipet district

నంగునూరు(సిద్దిపేట): బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది.
 
వివరాలు..  గ్రామానికి చెందిన దాండ్ల లావణ్య(30) భర్త పొట్టకూటికోసం దుబాయ్‌ వెళ్లాడు. ముగ్గురు పిల్లలతో లావణ్య గ్రామంలోనె నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన లావణ్య తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. గ్రామ శివారులో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు రక్తపు మరకలను అనుసరించుకుంటూ వెళ్లడంతో.. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో బస్తాలో మూటకట్టిన మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement