వివాహేతర సంబంధం: మహిళ హత్య | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: మహిళ హత్య

Published Sun, Jul 16 2017 7:34 PM

women killed over extra marital affair

తిరుపతి: తిరుపతి రూరల్‌ పరిధిలోని పుదిపట్ల ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఓ మహిళ హత్యకు గురైంది. గ్రామంలో జనార్దన్‌, అలిమేలు(33) దంపతులు నివాసం ఉంటున్నారు. జనార్దన్‌ టీటీడీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. ఆర్టీసీ బస్టాండ్‌లో టీ స్టాల్‌ నిర్వహిస్తున్న మహేష్‌ అనే వ్యక్తితో అలిమేలుకు పరిచయమైంది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలంగా వీరిద్దరూ బాగానే ఉన్నారు.

అలిమేలు శనివారం మొదటి భర్త జనార్దన్‌తో కలిసి తిరుమలకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంది. మహేష్‌ తన టీ స్టాల్‌ వద్ద ఉండిపోయాడు. ఆ రాత్రి ఏమైందో ఏమో కానీ మహేష్‌ ఉదయం ఇంటికెళ్లి చూసేసరికి అలిమేలు శవమై కనిపించింది. అతను ఎమ్మార్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అలిమేలు మెడపై చిన్నపాటి గాయాలు కనిపిస్తున్నాయి. హత్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ కళాశాలకు తరలించారు.

Advertisement
Advertisement