- నడిమివంకలో మద్యంషాపుల ఎదుట ఆందోళన
- వంటావార్పుకు యత్నం, మహిళా నాయకులు అరెస్ట్
అనంతపురం సెంట్రల్: జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేసి, మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్సీపీ 39వ డివిజన్ కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి మండిపడ్డారు. ఆదివారం నడిమివంకలో మద్యం షాపుల ఎదుట 13 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శాశ్వతంగా తొలగించేవరకూ ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకూర్చున్నారు. వంటావార్పు చేసిన నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో పోలీసులు జోక్యం చేసుకొని అరెస్ట్ చేసి నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్థానిక కార్పొరేటర్ సుశీలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రమ్మ మాట్లాడుతూ మద్యం షాపుల వల్ల స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల మహిళలు అటుగా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వెంటనే జనావాసాలు, గుడి, బడి, బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ మల్లికార్జునవర్మ ఆందోళనకారులతో చర్చించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శి వరలక్ష్మి, పద్మావతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు శ్రీదేవి, కార్పొరేటర్ హిమబిందు, భూలక్ష్మి, డీఓడబ్ల్యూవో జిల్లా కార్యదర్శి హేమలత, ఆవాజ్ నాయకులు వలి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సూర్యచంద్ర, రమేష్, డీఎవైఎఫ్ఐ నాయకులు ఆంజనేయులు, నూరుల్లా, ఎపీరైతు సంఘం నాయకులు సరస్వతి, జేవీవీ నాయకులు ప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళల సమరం
Published Sun, Jul 23 2017 11:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement