విష ద్రావణం తాగి మహిళ మృతి | Sakshi
Sakshi News home page

విష ద్రావణం తాగి మహిళ మృతి

Published Wed, Aug 17 2016 11:22 PM

Women Suicide

గాలివీడు  మండల పరిధిలోని తూముకుంట ఎగువమూలకు  చెందిన ఇర్రి మల్లికార్జున భార్య శివకళ్యాణి(22) కడుపునొప్పి తట్టుకోలేక విషద్రావణం తాగి మృతి చెందింది. మంగళవారం విషద్రావణం తాగిన ఆమెను మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది.  తహసీల్దార్‌ భవాని పంచనామ నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గాలివీడు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement