బిల్ట్ పేపర్ మిల్లు కార్మికుల నిరసన | Sakshi
Sakshi News home page

బిల్ట్ పేపర్ మిల్లు కార్మికుల నిరసన

Published Mon, Apr 25 2016 4:38 PM

workers' protest against management

వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ పేపర్ మిల్లు కర్మాగారం కార్మికులు సోమవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కంపెనీకి చెందిన 600 మంది కాంట్రాక్టు కార్మికులు బిల్ట్ కంపెనీ మెయిన్ గేటు ముందు మానవహారం నిర్వహించారు.

 11 నెలలుగా తమకు కంపెనీ వేతనాలు చెల్లించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కర్మాగారం పునరుద్ధరణకు రాయితీలు ప్రకటించినా... ఇంతవరకు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదని కార్మికులు వాపోయారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తాము ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు.

 

Advertisement
Advertisement