మఠంపల్లి/దామరచర్ల : కృష్ణా పుష్కరాల పనులను పరిశీలించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి మట్టపల్లి రానున్నట్లు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద జరగుతున్న పుష్కర పనులను వారు పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా దామరచర్ల మండలం వాడపల్లి, అడవిదేవులపల్లి పుణ్యక్షేత్రాల్లో సైతం మంత్రులు పర్యటించనున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి పీఏ గుడిపాటి సైదులుబాబు ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రుల వెంట ఎంపీతో పాటు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సైతం ఉంటారని తెలిపారు.
తప్పిపోతే
సమాచారం ఇవ్వడం...
దామరచర్ల : పుష్కరాలకు వచ్చే పిల్లలు, ఇతరులు తప్ప పోతే వాడపల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి. ఎస్సై సెల్ నెంబర్ 9440795607, ఇవికాక ఘాట్ల వద్ద ఏర్పాటు చేసే కంట్రోల్ పాయింట్లలో పిర్యాదు చేస్తే చేస్తే వాకీటాకీల ద్వారా విస్తృతంగా గాలింపు జరుగుతుంది. పుష్కరాకు వచ్చే భక్తులు అందరి వద్ద ఐటెంటీ కార్డు, అలాగే అందరి వద్ద కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నెంబర్లు రాసి ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.