- స్పష్టంచేసిన ఓబులవారిపల్లి - కృష్ణపట్నం రైల్వే కాంట్రాక్టు కంపెనీ
- రూ. ఐదు కోట్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం పనుల్లో తనకు 25 శాతం కమిషన్ ఇవ్వాలని స్పీకర్ శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్లు మీద దౌర్జన్యం చేసిన సంఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటన మరొకటి బయట పడింది. ఓబులవారిపల్లి- కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు చేస్తున్న గుజరాత్కు చెందిన మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులను నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్మే కరుగొండ్ల రామకృష్ణ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఆ కంపెనీ సెక్రటరీ కల్పేష్ దేశాయ్ ఇతర అధికారులు నెల్లూరులో సోమవారం విలేకరుల వద్ద ఎమ్మెల్యే బెదిరింపులు, దౌర్జన్యాలను బట్టబయలు చేశారు. తమ సైట్ మేనేజర్ రామును ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన ఆడియో సీడీలను మీడియాకు అందించారు.
రూ.183 కోట్ల పనిలో 5 శాతం కానీ, లేదా రూ.5 కోట్లు కానీ పర్సెంటేజీ కింద ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ తమ మీద ఒత్తిడి చేస్తున్నారని కల్పేష్ దేశాయ్ వెల్లడించారు. తాము తక్కువ మొత్తంతో ఈ కాంట్రాక్టు దక్కించుకున్నందువల్ల అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ సంస్థ అధికారులను బూతులు తిడుతున్నారనీ, పనులు చేస్తున్న సిబ్బంది మీద తన అనుచరులతో దాడులు చేయించడంతో వారు బెదిరిపోయి పనులకు రావడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే నుంచి తమకు రక్షణ కల్పించి పనులు జరిపించకపోతే రైల్వే శాఖకు చెప్పి పనులు పూర్తిగా నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయం గురించి రైల్వే మంత్రి సురేష్ప్రభు, రైల్వే ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు.
కంపెనీ మేనేజర్ రాము, ఎమ్మెల్యే రామకృష్ణ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ
మేనేజర్: నమస్తే సర్ నేను రాము. నేను మా కంపెనీ జీఎంకు ఫోన్ చేసి మీ నాలుగు డిమాండ్లు చెప్పినా ను. శుక్రవారం సాయంత్రం లేదా శనివారానికి వస్తామని చెప్పినారు. అంతవర కు పనిచేయించడానికి అడ్డు చెప్పొద్దు సార్.
ఎమ్మెల్యే: ఇలాంటివన్నీ వద్దు.. మీకు ఎన్నిసార్లు చెప్పినాను.
మేనేజర్: కాదు సార్ ఎమ్మెల్యే రామకృష్ణ మాకు అన్నలాంటోడు, మేం మాట్లాడుకుంటామని అంటున్నారు.
ఎమ్మెల్యే: అవన్నీ ఏం కుదరదు.. వాళ్లకు... పగలగొడతా (బూతులు తిట్టారు).
మేనేజర్: సార్ అలా అనద్దండి. శుక్రవారం నాటికి నేను వాళ్లను పిలిపిస్తా. అంతవరకు పనులు ఆగకుండా చేయిస్తే నేను కూడా చెప్పుకునే దానికి ఉంటుంది. ఎమ్మెల్యే జెంటిల్మెన్ నా మాటకు విలువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. శుక్రవారం నాటికి మా వాళ్లు వచ్చి సెటిల్ చేసుకోకపోతే శనివారం నేనే పనులు నిలిపివేయిస్తా.
ఎమ్మెల్యే: సరేలే మా వాళ్లతో చెబుతా.
ఎల్లో ట్యాక్స్ కట్టలేం
Published Tue, Sep 27 2016 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement