అంధ చిన్నారులకు యోగా శిక్షణ | Sakshi
Sakshi News home page

అంధ చిన్నారులకు యోగా శిక్షణ

Published Sun, Aug 14 2016 9:41 PM

Yoga training for blind chiledren

గుంటూరు స్పోర్ట్స్‌: శ్రీఆంజనేయం ధ్యాన యోగ మండలి అధ్వర్యంలో ఆదివారం బ్రాడీపేటలోని షిర్డీ సాయి దీనజన సేవా సమితి సభ్యులు అంధ బాలబాలికలకు ప్రత్యేక యోగ శిక్షణ శిబిరం జరిగింది. 4వ అదనపు జిల్లా జడ్జి గోకవరపు శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా  హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అంధులకు యోగ శిక్షణ ఇవ్వటం స్పూర్తిదాయకం అన్నారు. అనంతరం మండలి వ్యవస్ధాపకుడు, ప్రధాన యోగాచార్యుడు కిషోర్‌ గురూజీ దీనజన సేవా సమితికి రూ.10 వేలు విరాళంగా అందించారు. కార్యక్రమంలో అతిథులు  ఆర్‌.అశోక్‌ బాబు, పబ్బరాజు వెంకటేశ్వరరావు, యోగ గురువులు ఎం.సతీష్‌ కుమార్, శిఖాకొల్లి సత్యనారాయణ, బచ్చు విశ్వేశ్వరరావు, తల్లం చాముండేశ్వరరావు, యోగా సాధకులు, అంధ బాలబాలికలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement