పండ్లు కొనిస్తానని తీసుకెళ్లి.. | Sakshi
Sakshi News home page

పండ్లు కొనిస్తానని తీసుకెళ్లి..

Published Wed, Apr 6 2016 10:01 PM

పండ్లు కొనిస్తానని తీసుకెళ్లి.. - Sakshi

గూడురు: ఆరవ తరగతి విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలం పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ 6వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని దగ్గరకు బుధవారం మండలంలోని దామరవంచ గ్రామానికి చెందిన దారం సాగర్ (22) వచ్చాడు. బాలికకు బంధువైన అతడు పండ్లు కొనిస్తానని చెప్పి ఆమెను బండిపై అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. స్థానికంగా కొందరు రైతులు చూడడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement