ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

Published Thu, Aug 11 2016 7:22 PM

ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య

మల్యాల: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి, మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపం చెందిన యువతి ఉరేసుకున్న సంఘటన మండలంలోని తిప్పాయిపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సరెళ్ల మౌనిక(19) కరీంనగర్‌లోని ఓ కళాశాలలో బీకాం పథమ సవంత్సరం చదువుతోంది.

కొడిమ్యాలకు చెందిన మందల శేఖర్‌ ఆర్మీలో పనిచేస్తున్నాడు. వీరింద్దరూ రెండేళ్లు ప్రేమించుకున్నారు. అయితే ప్రియురాలికి తెలియకుండా శేఖర్‌ బుధవారం మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మృతురాలి తల్లి శారద ఫిర్యాదు మేరకు ఎస్సై రవీందర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement