యువతి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

యువతి దారుణ హత్య

Published Thu, Oct 20 2016 10:29 PM

యువతి దారుణ హత్య

– తలపై గట్టిగా కొట్టి చంపి.. దహనం చేసిన నిందితులు
–కడప నగర శివార్లలోని అగ్రిగోల్డ్‌ వెంచర్‌లో ఘటన
–డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం పరిశీలన

చెన్నూరు : కడప నగర శివార్లలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని యువతి(21)ని తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. చెన్నూరు పోలీస్టేషన్‌ పరిధిలోని కమలాపురం రోడ్డులో మదీనా ఇంజనీరింగ్‌ కళాశాల ఎదురుగా ఉన్న అగ్రిగోల్డ్‌ వెంచర్‌లో గురువారం దహనం చేసిన యువతి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఉదయం వాకింగ్‌కు వెళ్లగా మృతదేహం ఉన్నట్లు గమననించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్‌ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐలు వినోద్‌కుమార్, రాజేశ్వర్‌రెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌ టీంలను పిలిపించి క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం రాత్రే ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
హత్యచేసి..పెట్రోల్‌పోసి దహనం..
హంతకులు ముందుగా యువతిని ఓ చోట తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. ఓ వాహనంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మృతదేహంపై పెట్రోల్‌ పోసి ఎవ్వరూ గుర్తు పట్టని విధంగా ముఖంపైనే బాగా కాల్చారు. యువతికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. సంఘటన స్థలంలోనే మద్యం సేవించి దహనం చేశారనడానికి, రెండు బీరు బాటిల్లు, వాటర్‌ ప్యాకెట్లు, పెట్రోల్‌ తెచ్చిన బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. దుండగులు ఉపయోగించిన అనుమానిత వస్తువులను సేకరించారు. రిమ్స్‌ నుంచి వైద్యులను పిలిపించి శవపరీక్ష అక్కడే చేయించారు. మృతదేహం 19 నుంచి 24 ఏళ్లలోపు యువతిదని, తలపై బలంగా కొట్టి చంపి, ఇక్కడ కాల్చారని పోలీసులు భావిస్తున్నారు. దహనమైన మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ సదాశివయ్య తెలిపారు.
 

Advertisement
Advertisement