రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

Published Thu, Aug 11 2016 11:27 PM

younger suicide

ఎర్రగుంట్ల: ఎర్రగుంట్లలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి గురువారం తెలిపారు. మృతుడికి సుమారు 35 ఏళ్లు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలుపు, పసువు రంగు గల చొక్కా, నషం రంగు పాయింట్‌ ధరించి ఉన్నాడని చెప్పారు. రెండు చేతులకు సెలైన్‌ బాటిల్‌ ఎక్కించుకున్న ఇంజక్షన్‌ రబ్బర్లు ఉన్నాయని తెలిపారు. దీని బట్టి చూస్తే అతను వ్యాధిగ్రస్తుడుని తెలుస్తోందని వివరించారు. మృతుడిని గుర్తించిన వారు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement