మైపాడు బీచ్‌లో యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

మైపాడు బీచ్‌లో యువకుడి మృతి

Published Wed, Dec 14 2016 12:31 AM

మైపాడు బీచ్‌లో యువకుడి మృతి - Sakshi

ఇందుకూరుపేట : స్నేహితులతో కలిసి సరదాగా  సముద్ర తీరానికి  విహార యాత్రకు వచ్చి  ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటి మునిగి   మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మైపాడు బీచ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు నవాబుపేటకు చెందిన పుల్లిపాటి విజయ్‌కుమార్‌ (23) అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులు మహేష్, మనోహర్, హేమంత్‌ కలిసి మైపాడు బీచ్‌కు వచ్చారు. చూసి వెళ్దామని వచ్చిన స్నేహితులు సముద్రపు నీటిలో స్నానాలకు దిగారు. ప్రమాదవశాత్తు విజయ్‌కుమార్‌ నీటిలో మునిగాడు. విజయ్‌కుమార్‌ కనిపించకపోవడంతో స్నేహితులు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు విజయ్‌కుమార్‌ ఒడ్డుకు చేర్చారు. బీచ్‌ నుంచి ఆటోలో స్నేహితులు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ లోగా 108 వాహనం ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుంది. అయితే అప్పటికే విజయ్‌కుమార్‌ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 
 
 

Advertisement
Advertisement