► 2012లో రైతులు ప్రీమియం చెల్లిస్తే ఇంతవరకూ బీమా రాలేదు
►ఎస్డీపీ, ఉపాధి నిధులను టీడీపీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు
►పనులన్నీ నామినేషన్పై అప్పగించడం దుర్మార్గం
►జిల్లాలో రూ.470కోట్ల నిధులు దుర్వినియోగం
►దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
►ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
కడప కార్పొరేషన్: 2012వ సంవత్సరం శనగపంట బీమా మంజూరు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని, ఇందులో అసలు దోషి ప్రభుత్వమేనని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. 2012 పంటల బీమాకు సంబంధించి మొదటి విడత 25వేల మంది రైతులకు రూ.130కోట్లు, రెండో విడత 11262 మందికి రూ.55కోట్లు అందిందన్నారు.
ఇంకా 20 వేల మంది రైతులు బీమా కోసం ఎంతో ఆందోళనతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఏఐసీ కార్యాలయం ఎదుట ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధర్నా చేశాక ఏడాదిన్నర కిందట అప్పటి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగిందన్నారు. ఆ సమావేశం తర్వాత ఎలాంటి పొరపాట్లు లేని ప్రతిపాదనలకు వెంటనే బీమా చెల్లించాలని, మిగిలినవి రీవెరిఫికేషన్ చేయాలని నిర్ణయించారన్నారు. ఈ మేరకు రీవెరిఫికేషన్లో భాగంగా రెండో విడతలో 11,262 మంది అర్హత సాధించారన్నారు. ఇంకా 20వేలమందికి బీమా రావలసి ఉందన్నారు.
క్రాప్ సోయింగ్ డేట్ లేదనే కారణంతో ఈ దరఖాస్తులను పక్కనబెట్టారన్నారు. దీనికి కూడా అదే సమావేశంలో పరిష్కార మార్గం చూపినట్లు పేర్కొన్నారు.వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి మండలం నుంచి క్రాప్ సోన్ డేటా తెప్పించి ఇన్స్రూ?న్స్ కంపెనీకి అప్పగించారని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ వాటా ఇస్తామని లేఖ ఇస్తే కేంద్ర వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని 2016 ఏప్రిల్ 28న కేంద్ర వ్యవసాయ శాఖ లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ తరుపున కేంద్రానికి లేఖ రాసి పెండింగ్లో ఉన్న బీమా మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇస్తున్న స్పెషల్ డెవెలప్మెంట్ ప్యాకేజీ నిధులు, ఉపాధి హామీ నిధులు తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపడానికే తప్పా అభివృద్ధికి ఉపయోగపడటం లేదని ఎంపీ అవినాష్రెడ్డి విమర్శించారు. మూడేళ్లలో ఎస్డీపీ నిధులు రూ.150కోట్లు వచ్చాయని, ఉపాధి హామీ పథకం నిధులను నీరు–చెట్టు పనులకు మరలించి రూ.320కోట్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. మొత్తం రూ.470కోట్ల నిధులను టెండర్లు లేకుండా నామినేషన్పై టీడీపీ నాయకులు, కార్యకర్తలకు దోచిపెట్టారని దుయ్యబట్టారు.
ప్రజల ఓట్లతో ఎన్నికైన మేయర్, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఎస్డీపీ కింద నిధులు ఇవ్వమని లేఖలిస్తే ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. ఒక్క కడపలోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడి లేఖపై గత కలెక్టర్ రూ. 4.62కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారన్నారు. వెంటనే ఆ ప్రతిపాదనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే స్థానిక సంస్థల్లో ఉన్న అధికారులతో కాకుండా వేరే శాఖ అధికారులతో పనులు చేయించడమంటే ఖచ్ఛితంగా అధికార దుర్వినియోగం చేయడమేనన్నారు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపైనైనా పద్దతి మారాలని, ప్రజా ప్రతినిధులు ఇచ్చే ప్రతిపాదనలకు విలువ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు పాకా సురేష్కుమార్, చల్లా రాజశేఖర్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు పులి సునీల్కుమార్, చీర్ల సురేష్యాదవ్ పాల్గొన్నారు.
‘అసలు దోషి రాష్ట్ర ప్రభుత్వమే’
Published Fri, May 26 2017 1:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement