కాకినాడ : చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా కాపుల రిజర్వేషన్ అంశాన్ని పరిష్కరించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ నిన్న కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆత్మహత్య చేసుకున్న వెంకట రమణమూర్తి కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తన చావు ద్వారా అయినా చంద్రబాబు కళ్లు తెరుస్తారని వెంకట రమణమూర్తి ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఇప్పటికైనా కాపుల రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం తాత్సారం చేయకుండా వారిని బీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో చంద్రబాబు అధ్యయనం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు.
చంద్రబాబు తెలిసీతెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని, తమిళనాడుకు వెళితే అక్కడ రిజర్వేషన్లు ఎలా అమలవుతున్నాయో జ్ఞానోదయం కలుగుతుందని ఆయన అన్నారు. మార్గదర్శకాలు చెప్పకుండా కాపు రిజర్వేషన్లపై కమిషన్ వేయడం సరికాదన్నారు. 1953లో కాకా కలేల్కర్ ఇచ్చిన నివేదికలో కాపులను బీసీలుగా గుర్తించారన్నారు. రిజర్వేషన్ల కోసం వెంకట రమణమూర్తి ప్రాణత్యాగం చూసైనా చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రమణమూర్తి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు. చావుల వల్ల సాధించేది ఏమీ లేదని, అంతా ఒకటిగా పోరాడి సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబుకు కొంచెం తిక్క అని, అది కాస్త ముదిరిందని, అందుకే అవాకులు చెవాకులు పేలుతున్నారని వైఎస్ జగన్ అన్నారు.
'తమిళనాడు వెళ్తే బాబుకు జ్ఞానోదయం అవుతుంది'
Published Tue, Feb 2 2016 8:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement