పాల్మన్ పేట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ | Sakshi
Sakshi News home page

పాల్మన్ పేట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

Published Mon, Jul 18 2016 7:44 PM

పాల్మన్ పేట బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

విశాఖపట్నం: ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన పాల్మన్ పేట బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. సోమవారం విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లిన వైఎస్ జగన్.. పాల్మన్ పేటకు చేరుకున్నారు. సర్పంచ్ నాగార్జున కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. టీడీపీ నాయకులు తమపై దాడికి పాల్పడిన ఘటన గురించి వైఎస్ జగన్కు వివరించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు.

అంతకుముందు మునగపాక బహిరంగసభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఆ తర్వాత పాల‍్మన్ పేటకు బయల్దేరారు. తునిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. వైఎస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, ఎమ్మెల్యే రాజా, పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్కు స్వాగతం పలికారు.

Advertisement
Advertisement