రేపు ఏపీ సర్కార్ పై గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

రేపు ఏపీ సర్కార్ పై గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు

Published Mon, Dec 14 2015 9:52 PM

ys jaganmohanreddy will meet governor tommorrow

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేస్తారు.

వైఎస్ జగన్ ఫిర్యాదు చేసే అంశాల్లో ప్రధానంగా విశాఖ గిరిజనులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బాక్సైట్ విధానంతోపాటు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'కాల్ మనీ సెక్స్' రాకెట్ వంటి తదితర అంశాలున్నాయి. ముఖ్యంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యేల హస్తం ఉన్న నేపథ్యంలో కేసులు నమోదైనా వాటిని ముందుకు తీసుకెళ్లకుండా నేరుగా ముఖ్యమంత్రి పేషి నుంచే పోలీసు అధికారులపై ఒత్తిడి వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రధానంగా గవర్నర్ కు వైఎస్ జగన్ వివరించనున్నారు.   

 

Advertisement
Advertisement