గుంటూరు : కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఆరో రోజుకు చేరింది. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు చేరుకున్నారు.
కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైఎస్ విజమమ్మ మనోవేదన చెందారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగానికి గురయ్యారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరుకు బయల్దేరారు.