గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ | Sakshi
Sakshi News home page

గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ

Published Mon, Oct 12 2015 6:19 PM

గుంటూరు దీక్షాస్థలికి చేరుకున్న వైఎస్ విజయమ్మ - Sakshi

గుంటూరు : కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యంపై వైఎస్ విజయమ్మ ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నేటికి ఆరో రోజుకు చేరింది. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరు చేరుకున్నారు.

 

కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వైఎస్ విజమమ్మ మనోవేదన చెందారు.  ఈ సందర్భంగా ఆమె ఉద్వేగానికి గురయ్యారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా అక్కడే ఉన్నారు. మరోవైపు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరుకు బయల్దేరారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement