విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : వైఎస్సార్‌సీపీ నాయకులు | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : వైఎస్సార్‌సీపీ నాయకులు

Published Wed, Jan 11 2017 10:29 PM

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : వైఎస్సార్‌సీపీ నాయకులు - Sakshi

ముస్తాబాద్‌: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సుద్దాల నరేశ్‌ డిమాండ్‌ చేశారు. పదో పీఆర్‌సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు.

మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవుల వేతనాలు అందజేయాలన్నారు. అనంతరం ఆర్‌ఐ షరీఫ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు అలువాల వేణు, నవీన్, స్వామి, వెంకటేశ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి గాంతుల మహేశ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement