21న వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి ప్లీనరీ | Sakshi
Sakshi News home page

21న వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి ప్లీనరీ

Published Mon, Jun 12 2017 11:10 PM

ysrcp district pleanary on 21st at ktr function hall

అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా స్థాయి ప్లీనరీ తేదీ, వేదిక ఖరారయ్యాయి. ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి అనంతపురం నగరంలోని గుత్తిరోడ్డులో ఉన్న కేటీఆర్‌ ఫంక‌్షన్‌ హాలులో నిర్వహించనున్నారు. ప్లీనరీ ఏర్పాట్లపై సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ అధ్యక్షతన ప్రముఖ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్, క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి, రాప్తాడు, మడకశిర సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి ప్లీనరీలు విజయవంతం అయ్యాయని, అదే స్ఫూర్తితో జిల్లా ప్లీనరీని జయప్రదం చేయాలని శంకరనారాయణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సింగిల్‌విండో అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement