విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్లు అడిగితే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.450 కోట్లు మాత్రమే ఇచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. విశాఖలో గురువారం ఆయన మాట్లాడుతూ...ఏపీకి కేంద్రం రూ.1976 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు.
రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులపై చంద్రబాబు మాట్లాడకపోవడం సరికాదని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తక్షణం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకుంటున్నది ప్యాకేజీ కాదు, ప్రత్యేక హోదా అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని భూస్థాపితం చేయాలని చూస్తున్నాయని అంబటి మండిపడ్డారు. పోలవరం కుడికాల్వపై పట్టిసీమ నిర్మించి రూ.1600 కోట్లు చంద్రబాబు దోచుకున్నారన్నారు. ఇప్పుడు ఎడమకాల్వపై పురుషోత్తమపట్నం పేరుతో మళ్లీ దోపిడీకి తెరలేపారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే తప్ప ఏపీకి న్యాయం జరగదని ఆయన అన్నారు. నామ మాత్రపు నిధులిచ్చి ఏపీ ప్రజలను కేంద్రం అవమానించడం సరికాదన్నారు. హోదా లేదు, రాజధానికి నిధులు లేవు, పోలవరాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నిధులు కేటాయించి ఏపీని కేంద్రప్రభుత్వం ఆదుకోవాలని అంబటి డిమాండ్ చేశారు.
'రూ.4 లక్షల కోట్లు అడిగితే..450 కోట్లిచ్చారు'
Published Thu, Aug 18 2016 7:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement