సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని)ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రకటన చేశారు. నాని అభ్యర్థిత్వంపై జిల్లాలో హర్షం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్ సీపీకి రెండు సీట్లు రాగా, ఒక దానిని జిల్లాకు కేటాయించడం ద్వారా ఈ జిల్లా తనకు ఎంత ప్రాధాన్యమో జగన్ మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2013లో ఆయన ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. ఆయనకు 2014లోను, ఆ తరువాత 2016లో పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న అక్రమాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రెండు నెలల క్రితమే అధినేత నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ప్రకటన చేశారు. నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రకటించడంతో ఏలూరు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
ఆళ్ల నానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు
Published Fri, Mar 3 2017 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement