–వెన్నపూస గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం
–పట్టభద్రులు, వైఎస్సార్సీపీ శ్రేణులకు జిల్లా నేతల పిలుపు
–కదిరి నుంచి ‘ఎన్నికల శంఖారావం’
కదిరి : ‘పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్రెడ్డి మంచి పోరాట యోధుడు. ఆయనకు నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలపై బాగా అవగాహన ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకుంటే చంద్రబాబు మెడలు వంచి సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఆయన్ను శాసనమండలికి పంపేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాల’ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లాపై ఉన్న అభిమానంతో ‘వెన్నపూస’ను అభ్యర్థిగా ప్రకటించారని, అందుకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్కు కానుకగా ఇద్దామని అన్నారు. బుధవారం వారు ఎమ్మెల్సీ ఎన్నికల శంఖారావాన్ని కదిరి నుంచి పూరించారు. ఈ సందర్భంగా స్థానిక కృష్ణా çఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు, నిరుద్యోగులకు ఎన్నో వాగ్దానాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పటి దాకా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పారని, అలా ఇవ్వలేని పక్షంలో నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామన్నారని తెలిపారు. వీటిని ఎందుకు అమలు చేయలేదో చంద్రబాబును గట్టిగా ప్రశ్నించేందుకు వెన్నపూస గోపాల్రెడ్డి లాంటి సమర్థుడు మనకు కావాలని పేర్కొన్నారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసింది.
చంద్రబాబు మాత్రం హోదా రాకుండా సైంధవుడిలా అడ్డపడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారు. ఆయనకు దిమ్మ తిరిగేలా ప్రజల తీర్పు మారదని తెలియజెప్పేందుకు గోపాల్రెడ్డిని గెలిపించండి’ అని పార్టీ శ్రేణులు, పట్టభద్రులు, ఉద్యోగ, ఉపాధ్యాయులను కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీం, మాజీ మేయర్ రాగే పరశురాం, జెడ్పీ ఫ్లోర్ లీడర్ రవీంద్రారెడ్డి, నాయకులు బాలకృష్ణారెడ్డి, కదిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ కన్వీనర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, నిరుద్యోగులు పాల్గొన్నారు.
పోరాటయోధుడు గోపాల్రెడ్డి
Published Wed, Feb 8 2017 10:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement