అనంతపురం ఎడ్యుకేషన్ : విభజన అనంతరం పూర్తిగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ అభివద్ధి సాధించాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక మునిసిపల్ గెస్ట్హౌస్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డిని అడ్డుకున్నారు. అధికారుల సమావేశంలో మంత్రి పాల్గొనగా బయట బైఠాయించి ఆందోళన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ప్యాకేజీ కల్పిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం సిగ్గుచేటన్నారు.
ఎన్నికల ముందు నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు పోటీలు పడి రాష్ట్రానికి 5, 10, 15 ఏళ్లు హోదా ఇస్తేనే అభివద్ధి అని ప్రకటించారన్నారు. ఈరోజు ఎందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి ఎలా స్వాగతిస్తారన్నారు. ప్రత్యేక హోదాకు రాష్ట్ర ప్రభుత్వం మద్ధతిచ్చేదాకా టీడీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టులు చేసి టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శులు లోకేష్శెట్టి, సుధీర్రెడ్డి, బాబాసలాం, నాయకులు కిరణ్, అనిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే !
Published Wed, Sep 14 2016 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement