- కె.గోవర్దన్
గత 45 ఏళ్లుగా ఆదివాసీలు, ఇతర గిరిజను లు తెలంగాణ ఫారెస్టులో సాగు చేసుకుం టున్న పోడు భూములను బలవంతంగా లాక్కొని అడవిలో కలుపుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇం దుకై అటవీశాఖను ఉసిగొల్పుతున్నది. ఇప్పటికే పంటలను ధ్వంసం చేయడం, వ్యవ సాయ పరికరాలను స్వాధీనం చేసుకోవడం, భూముల చుట్టూ కంద కాలను తీయడం, పోడు చేసుకునే వారిపై కేసులుపెట్టి జైలుకు పంపిం చడం సాగిస్తున్నది. పోడుదారులపై సమరానికి సాయుధ పోలీసులను సైతం సిద్ధం చేస్తున్నది. ఈ పనులన్నీ సులువుగా చేసుకోవడానికి, కుట్రపూరిత పథకాలలో భాగంగా హరితహారం, పర్యావరణం, కోతు లబెడద లాంటి వాటిని అడ్డం పెట్టుకునే ప్రచారాన్ని ప్రారంభించింది.
పోడు భూములకు పట్టాలు ఇవ్వమని దశాబ్దాలుగా ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎత్తివేసిన దగ్గర నుంచి కమ్యూనిస్టు విప్లవకారుల నాయక త్వాన ఆదివాసులు ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళనలు చేస్తూనే ఉన్నా రు. ప్రతి ప్రభుత్వం మాయమాటలు చెప్పడం తప్ప పోడు భూములకు పట్టాలు మాత్రం మంజూరు చేయలేదు. చివరికి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా పట్టాలు దక్కడం లేదు. అరకొరగా కొంత మందికి పట్టాలు ఇచ్చి మిగిలిన వారందరికీ పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ యంత్రాంగం చేతులు దులుపుకున్నది. అధికార యంత్రాం గం తప్పుడు పద్ధతుల వల్ల లక్షలాది ఎకరాలలో సాగు చేసుకుంటున్న పోడుదారులకు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం కూడా పట్టాలు లభించే పరిస్థితి కనిపించడం లేదు.
కాకతీయ రాజులకాలంలో అటవీ ప్రాంతంలో నిర్మించిన పాకాల, బయ్యారం లక్నవరం, రామప్ప, గణపురం వగైరా పెద్ద పెద్ద చెరువులు ఆదివాసుల ప్రయోజనాలకు కాకుండా గిరిజనేతరుల వ్యవసాయాలకు నెలవయ్యాయి. అందువల్లనే ఆదివాసులు తమ ప్రాంతాలు వదిలి అడ వి లోతట్టుకు పోవాల్సి వచ్చింది. అటవీ సరిహద్దుల భూములన్నీ గిరిజనేతరుల పాలైనాయి. దీంతో సహజవనరులతో బతికే ఆదివాసీ లకు జీవనాధారం దెబ్బతిన్నది. అడవి సంపదలు కోల్పోయి, వ్యవ సాయ భూములు కోల్పోయిన ఆదివాసీలకు పోడు వ్యవసాయమే జీవనాధారమైంది. అందువల్లనే గత్యంతరం లేక పట్టా హక్కులు లేకు న్నా దశాబ్దాల తరబడి పోడు భూమియే తమ జీవనాధారంగా వారు బతుకుతున్నారు.
ఇంతలోనే కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆదివాసీల, ఇతర గిరిజనుల సంక్షేమమే తమ ధ్యేయమంటూనే కొత్త రాగాలు మొదలు పెట్టింది. దశాబ్దాలుగా పోడు భూములుగా ఉన్న వాటిలో తొలకరిలో 3 కోట్ల మొక్కలు నాటనున్నట్లు కొద్దికాలంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. మే నెలలో కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమా వేశంలో జులైలో 40 కోట్ల మొక్కలు నాటనున్నట్లు, వచ్చే ఏడాది 60 నుంచి 70 కోట్ల మొక్కలు నాటనున్నట్లు ప్రకటించారు. అటవీ అధికా రులకు ఆయుధాలు ఇవ్వనున్నట్లు, భూఆక్రమణదారులపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు. అంటే పొట్టకూటి కోసం పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులు కేసీఆర్ దృష్టిలో భూఆక్రమణదారులన్న మాట! వీరిని నిరంకుశ పీడీ చట్టం కింద జైలులో బంధిస్తాడన్నమాట! వీళ్ల పొట్టకూటి కోసం వ్యవసాయం చేసుకుంటున్న పొలాల్లో మొక్కలు నాటతారన్నమాట! జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలంగాణ ఫారెస్టును మరో శేషాచలంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తోందనిపిస్తోంది.
ఆదివాసీల పోడు భూములకు పట్టాహక్కులివ్వాలి
స్వతంత్రంగా బతకగలుగుతున్న పోడుదారుల భూములను కేసీఆర్ ప్రభుత్వం హరించడానికి కుట్ర చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం 1 ఆఫ్ 70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అడవి విధ్వంసానికి పైన పేర్కొన్న ప్రధాన కారణాలను అదుపు చేయడానికి గట్టి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దేశ, విదేశాల కార్పొరేట్ శక్తులకు అడవిని, కొండల్ని మైనింగ్లకు ఇవ్వడాన్ని మానుకోవాలి. రిజర్వ్ ఫారెస్టును అభివృద్ధి చేయడానికి, పాడటానికి అన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూనే ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు శషబిషలు లేకుండా పట్టాలు ఇవ్వాలి.
(నేడు హైదరాబాద్లో పోడు భూముల పరిరక్షణ వేదిక ధర్నా)
వ్యాసకర్త సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మొబైల్: 98661 90514
ఆదివాసులను అడవుల నుండి గెంటివేస్తారా!
Published Mon, May 25 2015 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement