కార్యాలయాల్లో పనిచే సే ఉద్యోగుల మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేసేందుకు, వారిలో పునరుత్తేజం నింపేందుకు, ప్రమోషన్, వీడ్కోలు లాంటి సందర్భాల్లో యాజమాన్యాలు విందులను ఏర్పాటు చేస్తుంటాయి. ఈ విందుల్లో ప్రవర్తన హూందాగా ఉంటేనే ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది. ఎలా మెలగాలో తెలియకపోతే నలుగురిలో అభాసుపాలు కావాల్సి వస్తుంది. ఆఫీస్ పార్టీల్లో ప్రవర్తన గురించి తెలుసుకుంటే పొరపాట్లకు ఆస్కారం ఉండదు.
మీరు మీలాగే..
విందుల్లో సహచరులతో సంభాషించేటప్పుడు మీరు మీలాగే సహజంగా ఉండండి. అహంభావం, అతిశయం వద్దు. కృత్రిమంగా ప్రవర్తించొద్దు. ఇలా చేస్తే మీ నటన ఎదుటివారికి వెంటనే తెలిసిపోతుంది. మీపై చిన్నచూపు కలుగుతుంది. సహోద్యోగులతో ఆరోగ్యకరమైన సంబంధాలను నాలుగు కాలాలపాటు కొనసాగించాలంటే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలి. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడొద్దు.
చొరవ తీసుకోండి
పార్టీలో ఒకచోట బిగుసుకుపోయి కూర్చోవడం సరికాదు. మీరే చొరవ తీసుకొని ఇతరులతో ఆహ్లాదకరమైన సంభాషణ ప్రారంభించండి. కలివిడితనం అవసరం. దీంతో మీరు నలుగురి దృష్టిలో వెంటనే పడతారు. మంచి గుర్తింపు వస్తుంది. అదేసమయంలో పుకార్లు పుట్టించేవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల్లో తప్పులు వెతికి, బయట ప్రచారం చేస్తారు. అందుకే వారితో ఎక్కువ మాట్లాడకపోవడమే మంచిది.
వినే లక్షణం
మీరు మాట్లాడడమే కాదు, ఎదుటివారికి కూడా నోరువిప్పే అవకాశం ఇవ్వండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. నచ్చితే అభినందించండి. తగిన సలహాలు ఇవ్వండి. దీనివల్ల వారి దృష్టిలో మీ విలువ కచ్చితంగా పెరుగుతుంది. ఇతరులు చెప్పేది పూర్తిగా వినాలంటే ఓర్పు, సహనం ఉండాలి.
వివాదాస్పద అంశాలొద్దు
సంభాషణలో కులం, మతం, ప్రాంతం, వర్గం... ఇలాంటి వివాదాస్పద, సున్నితమైన అంశాలకు చోటు కల్పించకండి. వీటిని ప్రస్తావిస్తే మాటామాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. ఇరువురి మధ్య ద్వేషం మొదలవుతుంది. కాబట్టి అప్రమత్తతే ప్రధానం. సంభాషణ ద్వారా కొత్త విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించండి. స్పోర్ట్స్, ట్రావెలింగ్ లాంటి వాటిపై మాట్లాడుకోవచ్చు.
సమయ పాలన
సమయ పాలన ప్రతి ఒక్కరికీ అవసరం. ఆఫీస్ పార్టీలకు సమయానికి చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్తే సహోద్యోగుల్లో మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. సహచరుడికి పదోన్నతి, బదిలీ అయినవారికి వీడ్కోలు లేదా పదవీ విరమణ.. ఇలా విందు ఉద్దేశం ఏమిటో ముందే తెలుసుకోవడం మంచిది. దానికి తగ్గట్టుగా సిద్ధమై వెళ్లాలి. వ్యక్తుల గురించి తెలియజేసేవి.. వారి మాటతీరు, ప్రవర్తనే. ఈ రెండూ సక్రమంగా ఉండేలా చూసుకుంటే.. ఆఫీస్ పార్టీల ను హూందాగా పూర్తిచేసుకొని రావొచ్చు.
ఆఫీస్ విందుల్లో ప్రవర్తన ఎలా!
Published Wed, Oct 29 2014 1:04 AM
Related news
-
భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ ఉద్యోగులు.. 23 ఏళ్లలో ఇదే మొదటిసారి!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 25,994 మంది ఉద్యోగులను తొలగించింది. 2001 తరువాత కంపెనీ ఒక సంవత్సర కాలంలో ఇంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి. సుమారు 23 సంవత్సరాలలో కంపెనీ ఇంత మంది ఉద్యోగులను ఎప్పుడూ తొలగించలేదని తెలుస్తోంది.ప్రస్తుతం కంపెనీలో 3,17,240 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. గతంతో పోలిస్తే ఈ సంఖ్య 7 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే జనవరి నుంచి మార్చి వరకు కంపెనీ కేవలం 5,423 మంది కొత్త ఉద్యోగులను చేర్చుకుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది వరుసగా ఐదవ త్రైమాసికంలో కంపెనీ లాభాల తగ్గుదల వల్ల జరిగినట్లు తెలుస్తోంది. గత పన్నెండు నెలల ప్రాతిపదికన Q4 అట్రిషన్ రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి తగ్గిందని స్పష్టమవుతోంది.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కూడా గత వారం దాని Q4 ఫలితాలను వెల్లడించింది. ఇందులో కూడా ఉద్యోగుల సంఖ్య 13,249 మంది తగ్గినట్లు తెలిసింది. 2004 తరువాత ఇంతమంది తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జనవరి-మార్చి త్రైమాసికం నాటికి కంపెనీ 1,759 మంది ఉద్యోగులను తగ్గించింది.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!కరోనా మహమ్మారి దేశంలో అధిక సంఖ్యలో ప్రబలిన తరువాత ఐటీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఎంతోమంది ఉద్యోగులు తమ ఉద్యోగులను కోల్పోవాల్సి వచ్చింది. ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించడం మాత్రమే కాకుండా.. కొత్త వారిని చేర్చుకోవడానికి కూడా సంస్థలు వెనుకడుగు వేసాయి.ఇక ఇన్ఫోసిస్ కంపెనీ క్యూ4 ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ 2024 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించినట్లు తెలుస్తోంది. కంపెనీ లాభాలు అంతకు ముందు త్రైమాసికం కంటే 30 శాతం వృద్ధి చెంది రూ. 7969 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. -
సంతోషంగా ఉంటేనే విధులు.. లేకుంటే 10 రోజులు సెలవులు!
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో చర్చనీయాంశంగా మారిన అంశం. దీని ప్రాముఖ్యత గత దశాబ్ద కాలంలో విపరీతంగా పెరిగింది. పనితోపాటు కుటుంబంతో గడపడం, అభిరుచులు మొదలైనవాటికి ఒక రోజులో కొంత సమయం కేటాయించడం మధ్య సమతౌల్యాన్ని ఈ పదం సూచిస్తుంది. దీని గురించి బాగా ఆలోచించిన ఒక చైనీస్ రిటైల్ వ్యాపారవేత్త తన సంస్థలో "అన్హ్యపీ లీవ్" అనే భావనను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఉద్యోగులు సంతోషంగా లేకుంటే విధులకు రాకుండా సెలవు తీసుకోవచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక పేర్కొంది. చైనాలోని రిటైల్ చైన్ అయిన పాంగ్ డాంగ్ లై వ్యవస్థాపకుడు, ఛైర్మన్ యూ డాంగ్లాయ్ ఈ కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. ఇది సిబ్బంది తమ అభీష్టానుసారం 10 రోజుల అదనపు సెలవులు తీసుకుకోవడానికి అనుమతిస్తుంది. "ప్రతి సిబ్బందికి స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ వారు సంతోషంగా లేని సమయాలు ఉంటాయి, కాబట్టి మీరు సంతోషంగా లేకుంటే, పనికి రావద్దు" అని ఆయన చెప్పారు. సెలవులు తీసుకోవాలనుకునే ఏ ఉద్యోగికీ యాజమాన్యం నో చెప్పదని డోంగ్లాయ్ స్పష్టం చేశారు. "ఈ సెలవును యాజమాన్యం తిరస్కరించలేదు. తిరస్కరణ అనేది ఉల్లంఘన" అని ఆయన స్పష్టం చేశారు. -
ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉద్యోగం.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం చేసేవారిలో చాలామంది ఒకే సంస్థలో ఏళ్లతరబడి జాబ్ చేస్తుంటారు. మరికొందరు సంవత్సరానికి ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంటారు. ఇంతకీ ఒకే కంపెనీలో సంవత్సరాలు తరబడి జాబ్ చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్పై Apna.co ఒక ఆన్లైన్ సర్వే చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పదివేల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించింది. వేతనం అనేది ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ, 54 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగడం కంటే కెరీర్లో పురోగతి సాధించడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. అంటే ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలలోనే వృత్తిపరమైన వృద్ధిని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 37 శాతం మంది ఉద్యోగులు వర్క్ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 44 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న కంపెనీలోని వర్క్ కల్చర్కు అలవాటు పడినట్లు సమాచారం. కొందరు లీడర్షిప్ రోల్స్ కోసం లేదా కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరిలో సుమారు 54 శాతం మంది ఉన్నారు. 40 శాతం ఉద్యోగులు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ యాక్టివిటీస్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, 36 శాతం మంది సీనియర్ లీడర్షిప్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. చేస్తున్న పనిలోనే స్కిల్ పెంచుకోవడానికి చూస్తున్న వారు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అది మాత్రమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగులను సంతృప్తి పరిస్తే (జీతాలు పెంచడం, ప్రోత్సాహాలు అందించడం) ఎక్కువ కాలం ఒకే సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడతారని సర్వేలు తేలింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలామందిలో ఉన్న కంపెనీలలోనే జాబ్ చేస్తూ.. ఉన్నత స్థాననానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పని విషయంలో స్వేచ్ఛ మాత్రమే కాకుండా.. వర్క్ కల్చర్, కమ్యూనికేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తెలిసినట్లు Apna.co సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'నిర్మిత్ పారిఖ్' వెల్లడించారు. -
ఆఫీస్లో నోటీసులు.. షాక్లో ఉద్యోగులు
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఆర్ధిక మాంద్యం దెబ్బకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూనే.. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగుల టైం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలా ఓ ఆఫీస్ మేనేజ్మెంట్ ‘టైమ్ క్లాక్ ఫ్రాడ్’ పేరుతో ఓ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ఆ మెమో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ రెడ్డిట్ యూజర్ హెచ్ఆర్ విభాగం జారీ చేసిన మెమోని షేర్ చేశారు. ఆ మెమోలో ఇలా ఉంది. టైమ్ క్లాక్ మోసాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు ఐదు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలలో భాగంగా ఆఫీస్ వర్క్ ప్రారంభించే ముందు ఉద్యోగులు వ్యక్తిగత కార్యకలాపాలు, బ్యాగ్, ఇతర వస్తువులను సర్ధడం లాంటి పనులు చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి తప్పని సరిగా మెమోలోని అంశాలను పాటించాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు మెమోలో హైలెట్ చేసింది. దీంతో పాటు 10 మంది ఉద్యోగులు రోజుకు 10నిమిషాలు వృధా చేస్తే... అంటే రోజుకు వంద గంటలు నెలకు మూడు వేలగంటలు.. అలా 50 గంటల పేరోల్ లాస్ అవుతుందని తెలిపింది. దీంతో మెమోలో పేర్కొన్న నిబంధనలపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమ అఫీస్లో ఎదురవుతున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
మా జాబ్స్ తీసేసి వాళ్లకు ఇస్తున్నారు.. టీసీఎస్పై తీవ్ర ఆరోపణలు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)పై అమెరికన్ ఉద్యోగులు తీవ్ర ఆరోపణలు చేశారు. జాతి, వయసు ఆధారంగా టీసీఎస్ తమపై చట్టవిరుద్ధంగా వివక్ష చూపుతుందని, షార్ట్ నోటీసుతో తమను తొలగించి హెచ్1బీ వీసాలపై భారత్ నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేస్తోందని అమెరికన్ ఉద్యోగుల బృందం ఆరోపించింది, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. డజన్ల కొద్దీ అతిపెద్ద అమెరికన్ క్లయింట్లు ఉన్న టీసీఎస్కు వ్యతిరేకంగా సుమారు 22 మంది అమెరికన్ ఉద్యోగులు యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. తొలగింపునకు గురైన టీసీఎస్ మాజీ ఉద్యోగుల్లో యూఎస్లోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న కాకేసియన్లు, ఆసియన్-అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు, 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. వీరిలో ఎంబీఏ, ఇతర ఉన్నత డిగ్రీలున్నవారూ ఉండటం గమనార్హం. అయితే ఈ ఆరోపణలను టీసీఎస్ ప్రతినిధి కొట్టిపారేశారు. 'చట్టవిరుద్ధమైన వివక్ష'కు సంబంధించిన ఆరోపణలు' అర్హత లేనివి, తప్పుదారి పట్టించేవి' అని తెలిపారు. "యూఎస్లో సమాన అవకాశాలు కల్పించే సంస్థగా టీసీఎస్ బలమైన రికార్డును కలిగి ఉంది. దాని కార్యకలాపాలలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది" అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.
Related News by category
-
జర్నలిజంలో గోపాలకృష్ణకు గోల్డ్ మెడల్
జర్నలిజంలో విస్తృత పరిశోధన చేసిన గోపాలకృష్ణకు గోల్డ్మెడల్ లభించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక పత్రికలు - భాష, విషయ విశ్లేషణ అన్న అంశంపై M Phil పరిశోధన చేసిన సీనియర్ జర్నలిస్ట్ మల్లాది వెంకట గోపాలకృష్ణకు శ్రీ బొప్పన్న స్మారక స్వర్ణ పథకం లభించింది. రవీంద్ర భారతిలో జరిగిన విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గోపాలకృష్ణ స్వర్ణ పథకాన్ని అందుకున్నారు. జర్నలిజం కమ్యూనికేషన్ థియరీస్, ఆధ్యాత్మికత, తెలుగు భాష అనే నాలుగు విస్తృతమైన పరిధి కలిగిన రంగాలను మేళవించి, ప్రతిపాదనలు చేసి శాస్త్రబద్ధంగా ఆ ప్రతిపాదనను నిరూపించినందుకు గాను మల్లాది పరిశోధన స్వర్ణ పథకానికి ఎంపికయింది. సబ్ ఎడిటర్ కం రిపోర్టర్ గా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి పలు ఛానళ్లు, పత్రికల్లో పని చేసిన మల్లాది తనదైన శైలిలో ప్రతిభను కనబరిచారు. కవి, రచయిత, భాషావేత్తగా, అనువాదకుడు. బోధకుడిగా నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా రాణించారు. పరిశోధన రంగంలో విస్తృతంగా పని చేసిన మల్లాదిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు తంగడి కిషన్ రావు, రిజిస్ట్రార్, గైడ్ ఆచార్య కడియాల సుధీర్ కుమార్, ఆచార్య వెంకటరామయ్య అభినందించారు. పథకాలు అందుకున్న పరిశోధక విద్యార్థిని విద్యార్థులందరికీ గవర్నర్ తమిళసై శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం సార్... ఆశీర్వదించండి
ఆంధ్రప్రదేశ్ గురుకులం విద్యార్థులు అరుదైన అవకాశం చేజిక్కించుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడ 10 నెలలు ఉండి పాఠాలు చదువుకోబోతున్నారు. ఈ గొప్ప అవకాశం వారి జీవితాలను మార్చనుంది. ఇందుకు కారణమైన ఏ.పి. సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం అంటున్నారు. ‘ఏ.పి గురుకులాలను సి.ఎం గారు ఆధునికంగా తీర్చిదిద్దడం వల్లే మాకు ఈ అవకాశం దక్కింది’ అంటున్నారు. ‘కెనడీ లుగర్–యూత్ ఎక్స్ఛేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్’ కింద అమెరికా వెళ్లిన విద్యార్థుల మనోగతాలు... మా దేశానికి అధ్యయానికి రండి అంటూ అగ్రదేశం అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానం ఏ.పి. గురుకుల పాఠశాలల్లో సీనియర్ ఇంటర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా చేసింది. నెలకు కనీసం రూ.10 వేలు కూడా సంపాదన లేని కుటుంబాల నుంచి వచ్చిన ఈ విద్యార్థులు అమెరికాను చూడటమే కాదు అక్కడ పది నెలలు ఉండి చదువుకునే అవకాశం పొందడం వారి జీవితాలను మార్చనుంది. ఇలా పేదపిల్లలకు పెద్ద అవకాశం దక్కడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన చదువుల మహాయజ్ఞం కీలకపాత్ర పోషించిందన్నది జగమెరిగిన సత్యం. ‘నాడు–నేడు’తో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు అధునాతంగా మారిపోవడంతోపాటు అన్ని వసతులూ సమకూరాయి. ఇంగ్లిష్ విద్య, నాణ్యమైన విద్యాబోధన, డిజిటల్ క్లాస్రూమ్లు, ఆన్లైన్ క్లాసులు, ట్యాబ్లు వంటి ఎన్నో సౌకర్యాలతో పేదపిల్లల పెద్ద చదువుకు కొత్త బాటలు పరుస్తున్నారు. తొమ్మిది దశల వడపోత ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో అంతర్జాతీయ అవగాహనలో భాగంగా యూనైటెడ్ స్టేట్స్ (యూఎస్) గత కొన్నేళ్లుగా ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ (కేఎల్ – వైఈఎస్) ప్రోగ్రామ్ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతి యేటా ఎంపికైన విద్యార్థులు పది నెలలపాటు అమెరికాలో ఉంటారు. దీనికి ఎంపిక కావాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల నుంచి గట్టి పోటీ ఉంటుంది. మొదట బయోడేటా నుంచి చివరి ఇంటర్వ్యూల వరకు తొమ్మిది దశల్లో కఠినతరమైన వడపోత కొనసాగు తుంది. దాదాపు తొమ్మిది నెలలపాటు కొనసాగే అన్ని అర్హత పరీక్షల ప్రక్రియను విజయవంతంగా దాటుకుని రాష్ట్రానికి చెందిన ఎస్సీ గురుకుల విద్యార్థులు డి.నవీన, ఎస్. జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్. ఆకాంక్షలు అవకాశాన్ని దక్కించుకున్నారు. వారంతా ఇటీవలే అమెరికాకు పయనమై వెళ్లారు. వారిని అక్కడ ఎంపిక చేసిన పాఠశాలలోచేర్పిస్తారు. ఆ విద్యార్థులు పరీక్షలు, క్రీడలతోపాటు మొత్తం పాఠశాల ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. ఆ విద్యార్థులకు అమెరికాలో ఎంపిక చేసిన కుటుంబాలు అతిథ్యం ఇస్తాయి. విద్యార్థులు ఒక్కొక్కరికీ దాదాపు 200 డాలర్లు (సుమారు రూ. 16,500) నెలవారీ ఆర్థిక తోడ్పాటు (స్టైపెండ్)ను అందిస్తారు. సీఎంకు కృతజ్ఞతలు 2023–24 విద్యా సంవత్సరానికి ‘కెన్నడీ లుగర్–యూత్ ఎక్సే ్చంజ్ అండ్ స్టడీ’ కోసం ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణాసియాలోని 38 దేశాల విద్యార్థులను ఎంపిక చేశారు. వారిలో మన దేశానికి చెందిన 30 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం గర్వకారణం. వీరికి కావలసిన నిత్యావసరాలు, దుస్తులు, బ్యాగులు, మొబైల్ఫోన్ల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆర్థికసాయం అందిస్తోంది. కేఎల్–వైఈఎస్ ప్రోగ్రామ్లో అమెరికా చదువులకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు డి. నవీన, ఎస్.జ్ఞానేశ్వరరావు, రోడా ఇవాంజిలి, బి.హాసిని, సీహెచ్ ఆకాంక్ష సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆగస్టు 31న కలిశారు. వారితోపాటు గతేడాది అమెరికా వెళ్లి కోర్సు పూర్తిచేసుకుని వచ్చిన విద్యార్థులు కె.అక్ష, సి.తేజ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల కుటుంబ నేప«థ్యం తదితర వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. యూఎస్ఏ లో చదువులు పూరై్త వచ్చిన తర్వాత కూడా వారి చదువులు కొనసాగించేలా నిరంతరాయంగా వారిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక్కో విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ట్యాబ్లను అందజేశారు. థాంక్యూ సీఎం సార్ అమెరికా చదువులకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన విప్లవాత్మక చర్యల వల్లే నాకు ఈ అవకాశం దక్కింది. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పెదగంట్యాడ మా ఊరు. మా నాన్న ప్రవీణ్ రాజ్ నెలకు రూ.7 వేలు సంపాదించే ప్రైవేటు ఉద్యోగి. తల్లి సుకాంతి గృహిణి. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితిలో గురుకులం ద్వారా ప్రభుత్వం నాకు మంచి విద్యావకాశాలు కల్పించింది. – రోడా ఇవాంజిలి, మధురవాడ గురుకులం, విశాఖ జిల్లా. విద్యాలయాల్లో మెరుగైన సదుపాయాలు మా వంటి పేద వర్గాల పిల్లలు చదివే విద్యాలయాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో బాగా తీర్చిదిద్దారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి మా గ్రామం. మా నాన్న దార కేశయ్య పదవ తరగతి చదివి వ్యవసాయ పనులతో నెలకు రూ.10 వేలు సంపాదిస్తాడు. ఐదవ తరగతి చదివిన అమ్మ ఆదిలక్ష్మమ్మ గృహిణి. పేదరికం కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గురుకులంలో 5 వ తరగతిలో చేరిన నేను ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నా. – డి.నవీన, మార్కాపురం గురుకులం ఆనందంగా ఉంది ప్రభుత్వ గురుకులంలో చదివే నేను అమెరికా చదువులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. విజయవాడ గుణదల ప్రాంతం మాది. మా నాన్న చొక్కా సురేష్ అటెండర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా అమ్మ వనజ గృహిణి. – సీహెచ్ ఆకాంక్ష, ఈడ్పుగల్లు ఐఐటీ– ఎన్ఐటీ అకాడమి, కృష్ణా జిల్లా పేద పిల్లల చదువులకు సీఎం శ్రద్ధ చూపిస్తున్నారు పేద పిల్లల ఉన్నత చదువుల కోసం సీఎం వైఎస్ జగన్ శ్రద్ధ చూపిస్తున్నారు. పేదవర్గానికి చెందిన నేను అమెరికా చదువులకు ఎంపిక అయ్యానంటే మా చదువులకు సీఎం సార్ అందించిన ప్రోత్సాహమే కారణం. చాలా సరదాగా మాతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం గారు మాకు రూ.లక్ష సాయం, ట్యాబ్లు అందించారు. సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, మల్లెనిపల్లి మా గ్రామం. మా నాన్న నరసింహులు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి. –హాసిని బలిగా, ఈడ్పుగల్లు ఐఐటీ– నీట్ అకాడమి, ఎస్సీ గురుకుల కలలో కూడా ఊహించలేదు నేను అమెరికా చదువుకు ఎంపిక అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రభుత్వం, ఉపాధ్యాయులు అందించిన సహకారం వల్లే ఈ అవకాశం దక్కింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం జి.కొత్తూరు మా ఊరు. మా నాన్న ఎస్.కృష్ణ మృతి చెందడంతో అమ్మ రాము రోజువారీ కూలీగా నెలకు ఆరు వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 2017లో గురుకులంలో 6వ తరగతిలో చేరి ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. – ఎస్. జ్ఞానేశ్వరరావు, శ్రీకృష్ణాపురం గురుకులం, విశాఖ జిల్లా. – యిర్రింకి ఉమమాహేశ్వరరావు, సాక్షి ప్రతినిధి, అమరావతి -
థ్యాంక్యూ టీచర్
‘మా టీచర్ ఇలా చెప్పలేదు’ ‘మా టీచర్ ఇలాగే చెప్పింది’ ‘మా టీచర్ కోప్పడుతుంది’ ‘మా టీచర్ మెచ్చుకుంటుంది’ పిల్లలకు ప్రతి సంవత్సరం ఒక ఫేవరెట్ టీచర్ దొరకాలి. ఇంట్లో తల్లి తర్వాత పిల్లలు తమ ఫేవరెట్ టీచర్ మీదే ఆధారపడతారు. వారి సాయంతో చదువు బరువును సులువుగా మోసేస్తారు. వారు ట్రాన్స్ఫర్ అయి వెళితే వెక్కివెక్కి ఏడుస్తారు. ‘టీచర్స్ డే’ సందర్భంగా పిల్లలు అభిమానించే టీచర్ల స్వభావాలూ... లక్షణాలు... అవి కలిగి ఉన్నందుకు వారికి ప్రకటించాల్సిన కృతజ్ఞతలు. పిల్లలు స్కూల్కు రాగానే తమ ఫేవరెట్ టీచర్ వచ్చిందా రాలేదా చూసుకుంటారు. ఒకవైపు ప్రేయర్ జరుగుతుంటే మరోవైపు ఒక కంటితో ఫేవరెట్ టీచర్ను వెతుక్కుంటారు. క్లాసులు జరుగుతుంటాయి. వింటుంటారు. కాని ఆ రోజు టైమ్టేబుల్లో ఫేవరెట్ టీచర్ క్లాస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తారు. స్కూల్లో ఎందరో టీచర్లు. కాని ఒక్కో స్టూడెంట్కు ఒక్కో ఫేవరెట్ టీచర్. ఆ టీచర్ మాటను వేదవాక్కుగా భావించేవారు గతంలో ఉన్నారు.. రేపూ ఉంటారు. ‘పాప... నువ్వు డాక్టర్ కావాలి’ అనంటే డాక్టరైన వారున్నారు. ‘బాబూ.. నీకు సైన్స్ బాగా వస్తోంది సైంటిస్ట్ కావాలి’ అనంటే ఆ మాటలు మరువక సైంటిస్ట్ అయినవారున్నారు. ఫేవరెట్ టీచర్లు పిల్లలను గొప్పగా ఇన్స్పయిర్ చేస్తారు. బలం ఇస్తారు. ప్రేమను పంచుతారు. వారే లేకపోతే చదువులు భారంగా మారి ఎందరో విద్యార్థులు కుదేలయి ఉండేవారు. ► సబ్జెక్ట్ బాగా వచ్చినవారు ఫేవరెట్ టీచర్లు ఎవరు అవుతారు? సబ్జెక్ట్ ఎవరికి బాగా వస్తుందో వారు చాలామందికి ఫేవరెట్ టీచర్ అవుతారు. సబ్జెక్ట్ బాగా వచ్చినవారు అది ఎలా చెప్తే పిల్లలకు బాగా అర్థమవుతుందో తెలుసుకుని చెప్తారు. పిల్లలకు అర్థం కావాల్సింది పాఠం సులభంగా అర్థం కావడం. అర్థమైతే పాఠం పట్ల భయం పోతుంది. భయం పోతే ఆ సబ్జెక్ట్ మరింతగా చదవాలనిపిస్తుంది. అందుకు కారణమైన టీచర్ను అభిమానించబుద్ధవుతుంది. సబ్జెక్ట్ను అందరికీ అర్థమయ్యేలా చెప్తూ, క్లాసయ్యాక కూడా వచ్చి అడిగితే విసుక్కోకుండా సమాధానం చెప్తారనే నమ్మకం కలిగిస్తూ, చెప్తూ, పాఠం అర్థం కాని స్టూడెంట్ను చిన్నబుచ్చకుండా గట్టున ఎలా పడేయాలో ఆలోచించే టీచర్ ఎవరికైనా సరే ఫేవరెట్ టీచర్. ► మనలాంటి వారు పిల్లలు తమలాంటి టీచర్లను, తమను తెలుసుకున్న టీచర్లను ఇష్టపడతారు. క్లాస్లో రకరకాల పిల్లలు ఉంటారు. రకరకాల నేపథ్యాల పిల్లలు ఉంటారు. వారి మాతృభాషను, ప్రాంతాన్ని, నేపథ్యాన్ని గుర్తెరిగి వారితో ప్రోత్సాహకరంగా మాట్లాడే టీచర్లను పిల్లలు ఇష్టపడతారు. ‘మీది గుంటూరా? ఓ అక్కడ భలే ఎండలు. భలే కారం మిరపకాయలు దొరుకుతాయిరోయ్’ అని ఒక స్టూడెంట్తో ఒక టీచర్ అంటే ఆ స్టూడెంట్ కనెక్ట్ కాకుండా ఎలా ఉంటాడు. ‘రేపు మీరు ఫలానా పండగ జరుపుకుంటున్నారా? వెరీగుడ్. ఆ పండగ గురించి నాకు తెలిసింది చెప్తానుండు’ అని ఏ టీచరైనా అంటే పిల్లలు వారిని తమవారనుకుంటారు. భాషాపరంగా, సంస్కృతి పరంగా పిల్లలు కలిగి ఉన్నదంతా తమది కూడా అని భావించిన ప్రతి టీచర్ ప్రతి విద్యార్థికీ ఫేవరెట్ టీచరే. ► అందరూ సమానమే ఒక టీచర్ను పిల్లలు ఎప్పుడు అభిమానిస్తారంటే వారు అందరినీ సమానంగా చూస్తారనే భావన కలిగినప్పుడు. టీచర్లు ఫేవరిటిజమ్ చూపిస్తే ఆ పిల్లల్ని మాత్రమే వారు ఇష్టపడతారని, తమను ఇష్టపడరని మిగతా పిల్లలు అనుకుంటారు. మంచి టీచర్లు అందరు పిల్లల్నీ ఇష్టపడతారు. ‘టీచర్ నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంటుంది’ అని పిల్లలు అనుకునేలా టీచర్ ఉండాలి. కొంతమంది స్టూడెంట్లు మంచి మార్కులు తెచ్చుకుంటే వారిని ఎక్కువ పొగిడి కొంతమంది స్టూడెంట్లు ఎంత బాగా చదువుతున్నా మెచ్చుకోకుండా ఉండే టీచర్లు పిల్లలను భావోద్వేగాలకు గురిచేస్తారు. టీచర్ మెచ్చుకోలు, టీచర్తో సంభాషణ పిల్లల హక్కు. అది పిల్లలకు ఇవ్వగలిగిన టీచర్ ఫేవరెట్ టీచర్. ► క్రమశిక్షణ పిల్లలు తమ ఫేవరెట్ టీచర్లో క్రమశిక్షణ ఆశిస్తారు. టైమ్కు సిలబస్ పూర్తి చేయడం, టైమ్కి స్కూల్కు రావడం, క్లాసులు ఎగ్గొట్టకపోవడం, సరిగ్గా నోట్స్ చెప్పడం, సరిగ్గా పరీక్షలకు ప్రోత్సహించడం, ఎంత సరదాగా ఉన్నా క్లాస్ జరుగుతున్నప్పుడు సీరియస్గా ఉండటం... ఇవీ పిల్లలు ఆశిస్తారు. తాము గౌరవించదగ్గ లక్షణాలు లేని టీచర్లను పిల్లలు ఫేవరెట్ టీచర్లు అనుకోరు. టీచర్ వృత్తి ఎంతో గొప్ప వృత్తి. టీచర్లు కూడా మనుషులే. వారిలోనూ కోపతాపాలు ఉంటాయి. కాని ఎంతోమంది టీచర్లు పిల్లల కోసం తమ జీవితాలను అంకితం చేసి వారి జీవితాలను తీర్చిదిద్దుతారు. ‘మీరు పెద్దవాళ్లయి పెద్ద పొజిషన్కు వెళితే అంతే చాలు’ అంటూ ఉంటారు. మంచి టీచర్లు, గొప్ప టీచర్లు పిల్లల శ్రేయస్సును ఆకాంక్షించి తద్వారా వారి గుండెల్లో మిగిలిపోతారు. పిల్లల హృదయాల్లో ప్రేమ, గౌరవం పొందిన టీచర్లందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు. ► మంచి ఫ్రెండ్ కొందరు టీచర్లు క్లాస్లో ఫ్రెండ్లా ఉంటారు. 45 నిమిషాల క్లాస్లో 40 నిమిషాలు పాఠం చెప్పి ఒక ఐదు నిమిషాలు వేరే కబుర్లు, విశేషాలు మాట్లాడతారు. పిల్లల కష్టసుఖాలు వింటారు. వారి తగాదాలు తీరుస్తారు. ఎవరైనా చిన్నబుచ్చుకుని ఉంటే కారణం తెలుసుకుంటారు. ముఖ్యంగా దిగువ ఆర్థిక పరిస్థితి ఉన్న పిల్లలు ఇలాంటి టీచర్లను చాలా తీవ్రంగా అభిమానిస్తారు. తమ కష్టాలు చెప్పుకోవడానికి ఒక మనిషి ఉన్నట్టుగా భావిస్తారు. అదే మంచి ఆర్థికస్థితి ఉన్న పిల్లలైతే తమకు ఎమోషనల్ సపోర్ట్ కోసం చూస్తారు. పాఠాల అలజడుల నుంచి ధైర్యం చెప్పే టీచర్ను అభిమానిస్తారు. -
ఈ రంగంలో అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు మీ సొంతం
ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్.. అర్హతలుంటే కొలువులు ఖాయం చేస్తున్న రంగం. ఎంట్రీ లెవల్ మొదలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వరకూ.. చక్కటి ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల ఈ రంగం టెక్నికల్ నుంచి స్పెషలైజ్డ్ జాబ్ ప్రొఫైల్స్ వరకూ.. భారీగా నియామకాలు చేపడుతోంది! ఉద్యోగార్థులు.. సంబంధిత అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఫైనాన్షియల్ సేవల రంగంలో తాజా రిక్రూట్మెంట్ ట్రెండ్స్.. కొలువులు..అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. కరోనా పరిణామాల్లో అంతా డిజిటలైజేషన్ బాట పట్టారు. దాంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఈ సెక్టార్ పరిధిలోకి వచ్చే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, బీఎఫ్ఎస్ఐ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ.. ఇలా అన్నింటిలోనూ కార్యకలాపాలు తిరిగి వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా ఫైనాన్షియల్ రంగంలో నియామకాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ.. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లోని సంస్థల్లో నమోదైన నూతన నియామకాల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అందుకే కొలువులు గత కొంత కాలంగా అనేక సంస్థలు స్టాక్ మార్కెట్లో ఐపీఓల బాటపట్టాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ప్రయివేట్ ఈక్విటీ సంస్థలకు నిధులు భారీగా వస్తున్నాయి. ట్రేడింగ్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు సంస్థలు టెక్నాలజీ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించడంపై దృష్టిపెడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం సైతం విస్తరిస్తోంది. ఇవన్నీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో నియామకాల జోరుకు కారణాలుగా చెబుతున్నారు. వీటన్నింటి ఫలితంగా సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులు మొదలు టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ..ఫైనాన్షియల్ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. జూనియర్, మిడిల్ లెవల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో.. జూనియర్, మిడిల్ లెవల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయి. కరోనా ముందుకాలం నాటి ఆఫర్స్తో పోల్చుకుంటే.. సగటున 30 నుంచి 50 శాతం మేర కొత్త కొలువులు లభించాయి. జూనియర్ లెవల్లో 1 నుంచి 4ఏళ్ల అనుభవం ఉన్న వారిని, మిడిల్ లెవల్లో అయిదు నుంచి 13ఏళ్ల అనుభవం ఉన్న వారిని సంస్థలు నియమించుకుంటున్నాయి. బీఎఫ్ఎస్ఐ.. ఎవర్గ్రీన్ ఫైనాన్షియల్ సెక్టార్ అనగానే గుర్తుకొచ్చే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) సెక్టార్లోని సంస్థలు.. రిక్రూట్మెంట్స్లో ఎవర్గ్రీన్గా నిలుస్తున్నాయి. 2020 సెప్టెంబర్తో పోలిస్తే.. 2021 సెప్టెంబర్ నాటికి బీఎఫ్ఎస్ఐ రంగంలో 43 శాతం అధికంగా నియామకాలు జరిగినట్లు నౌకరీ జాబ్స్ స్పీక్ ఇండెక్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టాలెంట్ కొరత ఫైనాన్స్ రంగంలో భారీగా నియామకాలు జరుగుతున్నప్పటికీ.. కంపెనీలకు అవసరమైన టాలెంట్ కొరత నెలకొన్నట్లు చెబుతున్నారు. నైపుణ్యాలున్న మానవ వనరులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు కంపెనీలు, స్టాఫింగ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా ఉంది. వేతనాలు ఆకర్షణీయం నైపుణ్యాలున్న వారికి ఫైనాన్షియల్ రంగ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలు అందిస్తున్నాయి. జూనియర్ లెవల్లో సగటున రూ.8లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో రూ.18లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఫైనాన్షియల్ రంగం.. జాబ్ ట్రెండ్స్.. ముఖ్యాంశాలు ► ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో భారీగా నియామకాలు. ► జూనియర్, మిడిల్ లెవల్లో 30 నుంచి 50 శాతం వరకూ పెరుగుదల. ► జూనియర్ లెవల్లో రూ.8 లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో సగటున రూ.18 లక్షల వరకు వేతనాలు. ► సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఏఐ–ఎంఎల్ నిపుణులకు డిమాండ్. రీసెర్చ్ అనలిస్ట్ ఫైనాన్షియల్ రంగంలో ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, ఈక్విటీ, ట్రేడింగ్ సంస్థల్లో కీలకంగా నిలుస్తున్న జాబ్ ప్రొఫైల్.. రీసెర్చ్ అనలిస్ట్. ఆయా స్టాక్స్కు సంబంధించి రీసెర్చ్ చేసి ఫండ్ మేనేజర్లకు వాటి సానుకూలతలు, ప్రతికూలతల గురించి సూచించడం.. క్లయింట్ల కోసం ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీస్పై విశ్లేషణ వీరి ప్రధాన విధులు.ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ బ్రోకరేజ్ సంస్థలు.. ఎంబీఏ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్లో పీజీ ఉత్తీర్ణులను రీసెర్చ్ అనలిస్టులుగా నియమించుకుంటున్నాయి. ఫండ్ మేనేజర్ ఆయా ఫండ్స్లో ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి సందర్భంలో సదరు సంస్థల ప్రస్తుత పనితీరు, ఆర్థిక ఫలితాలు, లాభనష్టాలు, డివిడెండ్స్.. భవిష్యత్లో ఆ సంస్థల పనితీరు ఎలా ఉండబోతోంది వంటి అంశాలను విశ్లేషించి.. ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దిష్ట ఫండ్లలో పెట్టుబడుల గురించి ఇన్వెస్టర్లను ఒప్పించడం వంటి కీలక విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు.. ఎంబీఏ, సీఏ, ఫైనాన్షియల్ ప్లానింగ్, కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ స్థాయి అర్హతలు ఉన్న వారికి ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల నిర్వహణ.. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల ప్రధాన విధి. వీరు నిత్యం సెక్యూరిటీస్ క్రయ విక్రయాలు, పోర్ట్ఫోలియో సమీక్ష, లావాదేవీల పరిష్కారం, సంబంధిత స్టాక్స్, పనితీరు, నియంత్రణ,క్లయింట్ల(ఇన్వెస్టర్లు)కు నివేదించడం వంటివి చేయాల్సి ఉంటుంది. సంస్థలు కామర్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్తో బ్యాచిలర్, పీజీ ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. టెక్ నిపుణులకు అవకాశం ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు.. ఇన్వెస్ట్మెంట్ అనాలసిస్లో బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఫలితంగా బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల ఉత్తీర్ణులకు ఈ రంగంలో కొలువులు లభిస్తున్నాయి. యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ మొత్తం, దాని ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం, చెల్లించే సామర్థ్యం, వయసు తదితరాలు గణించి.. పాలసీకి అర్హతలు నిర్ణయించే వారే..యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్. వీరికి బీమా సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. యాక్చుయేరియల్ సొసైటీ నిర్వహించే కోర్సుల ఉత్తీర్ణులకు ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి. అండర్ రైటర్స్ ఇన్సూరెన్స్ సంస్థల్లో మరో కీలకమైన కొలువు..అండర్ రైటర్స్. ఎవరైనా ఒక వ్యక్తి పాలసీ తీసుకోవాలనే ప్రతిపాదన చేసినప్పుడు.. దాన్ని పరిశీలించి, సదరు పాలసీకి ఆ వ్యక్తి సరితూగుతారో లేదో నిర్ణయించడం వీరి ప్రధాన విధి. ప్రత్యేక అర్హతలున్న వారికే సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందించే అసోసియేట్ డిప్లొమా ఉత్తీర్ణులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. రిస్క్ అనలిస్ట్స్ నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో.. పాలసీ చేయాలనుకున్న వస్తువులు లేదా నిర్మాణాలను పరిశీలించి.. వాటి జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రిస్క్ అనలిస్ట్లు నివేదికలు ఇస్తారు. సదరు నివేదిక ఆధారంగానే సంస్థ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ క్లెయిమ్ల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. ముఖ్యంగా పాలసీ వ్యవధి పూర్తి కాకుండానే ఏదైనా సంఘటన జరిగిందని.. ఆ కారణంగా బీమా చెల్లించాలనే విషయంపై తుది నిర్ణయం వీరిచ్చే నివేదికపైనే ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ ఎగ్జిక్యూటివ్స్.. సదరు బీమా మొత్తం కోసం వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి, డ్యామేజ్ విలువను లెక్కిస్తారు. ఆ మొత్తానికి బీమా పరిష్కారం లభిస్తుంది. బ్యాంకింగ్లో అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో.. క్షేత్ర స్థాయిలో కస్టమర్లతో సంప్రదింపులు సాగించే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మొదలు ఉన్నత స్థాయిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ వరకూ.. అనేక రకాల అవకాశాలు లభిస్తున్నాయి. బిజినెస్ బ్యాంకింగ్ మేనేజర్, కార్పొరేట్ బిజినెస్ సేల్స్ మేకర్, బ్రాంచ్ సర్వీస్ పార్ట్నర్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫీసర్, రిస్క్ ఎగ్జిక్యూటివ్స్, ఫైనాన్షియల్ ప్లానర్ వంటి ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో అందుకోవచ్చు. -
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో.. క్లర్క్ కొలువుల పిలుపు
బ్యాంకింగ్ రంగం.. ఒక్కసారి కొలువుదీరితే.. వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు! చక్కటి వేతనాలు, కెరీర్ పరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే భావన!! అందుకే.. ఏటా లక్షల మంది బ్యాంకు కొలువుల నియామక పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు! నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తూ.. ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఐబీపీఎస్ తీపికబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏడు వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షల విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్పై ప్రత్యేక కథనం... ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ మొదలు స్పెషలిస్ట్ ఆఫీసర్ల వరకూ.. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వేల సంఖ్యలో నియామకాలు చేపడుతోంది. తాజాగా ఐబీపీఎస్ సంస్థ.. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్–11(సీఆర్పీ క్లర్క్స్–11) పేరిట 7855 క్లర్క్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 బ్యాంకులు ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11 ద్వారా మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్ట్ల భర్తీ చేపట్టనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 387, తెలంగాణలో 333 పోస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర రీజియన్లకు కూడా పోటీ పడొచ్చు. ఎంచుకున్న రీజియన్కు సంబంధించి.. అక్కడి అధికారిక భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హతలు ► అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1, 2021 నాటికి 20–28 ఏళ్ల మధ్యలో ఉండాలి. (జూలై 2, 1973 తర్వాత జూలై 1, 2001 లోపు జన్మించి ఉండాలి). ► ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు. రెండంచెల రాత పరీక్ష ఐబీపీఎస్ క్లర్క్స్ ఎంపిక ప్రక్రియ.. రెండంచెల రాత పరీక్ష విధానంలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్కు ఎంపిక చేస్తారు. మెయిన్లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్ అందిస్తారు. తుది ఎంపికలో మెయిన్పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11(2022–23) రాత పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు, ఉర్దూ ఉన్నాయి. వాస్తవానికి జులై నెలలోనే ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ నివేదిక పదిహేను రోజుల్లో వస్తుందని.. అప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐబీపీఎస్కు సూచించింది. దీంతో ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియను నిలిపేసింది. దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరిగి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రిలిమినరీ పరీక్ష ఇలా ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 20 ని. న్యూమరికల్ ఎబిలిటీ 35 35 20 ని రీజనింగ్ ఎబిలిటీ 35 35 20 ని మొత్తం 100 100 60 నిమిషాలు (ఒక గంట) మెయిన్ పరీక్ష విధానం ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ను రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్కు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆ వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 50 35 ని ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 35 ని రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 50 60 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మొత్తం 190 200 160 ని ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2021లో జరగనుంది. ఆ తర్వాత మెయిన్ జనవరి/ఫిబ్రవరి 2022లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంటే.. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్కు దాదాపు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్కు ఉపక్రమించాలి. రెండింటికీ కలిసొచ్చేలా ప్రిలిమ్స్, మెయిన్కు సంబంధించి మూడు విభాగాలు (ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ) రెండు పరీక్షల్లోనూ ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రిలిమ్స్లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా ఉంటుంది. మెయిన్లో క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలో ఉండే ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. గ్రామర్కే పరిమితం కాకుండా..జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టిపెట్టాలి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్లోని న్యూమరికల్ ఎబిలిటీ, మెయిన్లోని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కు సరితూగే విభాగంగానూ పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలైన పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్మాస్ నియమాలపై పూర్తిగా పట్టుసాధించేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్లపైనా అవగాహన పెంచుకోవాలి. రీజనింగ్ ఇది కూడా ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్తోపాటే మెయిన్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్తోపాటే మెయిన్లో అదనంగా ఉండే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్,కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల ప్రిపరేషన్ కూడా సాగించాలి. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్ అదనపు అంశాలపై దృష్టి పెట్టాలనుకునే ఆలోచన సరికాదు.ఎందుకంటే..ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత మెయిన్కు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. తక్కువ సమయంలో మెయిన్ సిలబస్ మొత్తం కవర్ చేయడం కష్ట సాధ్యంగా మారుతుంది. జనరల్ అవేర్నెస్/ఫైనాన్షియల్ అవేర్నెస్: ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అబ్రివేషన్లు, పదజాలం, విధులు, కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్ చట్టాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్లోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్పై అవగాహన ప్రిలిమ్స్, మెయిన్.. రెండు కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. కాబట్టి ఆన్లైన్ టెస్ట్ విధానంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. దీనికి మార్గంగా గ్రాండ్ టెస్ట్లను ఎంచుకోవాలి. గ్రాండ్ టెస్ట్లకు ఆన్ౖలైన్ విధానంలో హాజరైతే సబ్జెక్ట్ నైపుణ్యాల్లో సామర్థ్యంతోపాటు, ఆన్లైన్ విధానంపైనా స్పష్టత ఏర్పడుతుంది. క్లర్క్ కొలువుతో.. డీజీఎం వరకు ► ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్గా నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో సీజీఎం లేదా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగే అవకాశముంది. ప్రారంభంలో క్లర్క్గా నియమితులైన అభ్యర్థులకు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. సింగిల్ విండో ఆపరేటర్, హెడ్ క్యాషియర్, స్పెషల్ అసిస్టెంట్, యూనివర్సల్ టెల్లర్, అగ్రికల్చర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరు నెలల ప్రొబేషన్ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. పూర్తి స్థాయిలో నియామకం ఖరారవుతుంది. ► కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంకులు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే.. ట్రైనీ ఆఫీసర్(ఎఎంజీఎస్–ఐఐ) హోదా లభిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానెల్ విధానంలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు నేరుగా జేఎంజీఎస్ స్కేల్–1 ఆఫీసర్గా పదోన్నతి పొందొచ్చు. ► క్లర్క్గా కెరీర్ ప్రారంభించాక జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేస్తే.. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ ద్వారా మూడేళ్ల అనుభవంతో ట్రైనీ ఆఫీసర్గా తొలి పదోన్నతి పొంది.. ఆ తర్వాత ప్రతి మూడేళ్ల సీనియారిటీతో డీజీఎం హోదా వరకు చేరుకోవచ్చు. అంతేకాకుండా డీజీఎం హోదాలో మూడేళ్ల అనుభవంతో జీఎంగా.. మరో మూడేళ్ల అనుభవంతో సీజీఎంగా.. ఆ తర్వాత మూడేళ్ల అనుభవంతో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై12–14, 2021లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబర్ 2021 ► ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్: జనవరి/ఫిబ్రవరి 2022 ► ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్ 2022 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
Advertisement