Sakshi News home page

పార్థసారథి భార్య వద్ద నుంచి 45 లక్షలు స్వాధీనం

Published Sat, Apr 19 2014 2:06 AM

45 lakhs seized from Partha sarathi Wife

సాక్షి, హైదరాబాద్/విజయవాడ: మాజీ మంత్రి కె.పార్థసారథి సతీమణి  కమల నుంచి హైదరాబాద్ పోలీసులు రూ. 45.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కమల శుక్రవారం వేకువజామున ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తుండగా నగర శివార్లలోని ఆటోనగర్ వద్ద పోలీసులు బస్సును తనిఖీ చేశారు. ఆమె వద్ద నుంచి  డబ్బు స్వాధీనం చేసుకుని సొంత పూచీకత్తుపై వదిలేశారు.
 
 ఆ డబ్బుకు ఆధారాలు ఉన్నాయి: పార్థసారథి
 
 తన సతీమణి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుకు అన్ని ఆధారాలూ ఉన్నాయని పార్థసారథి శుక్రవారం తెలిపారు. తన ఎన్నికల ప్రచారానికి, తన కన్‌స్ట్రక్షన్ కంపెనీ బకాయిల చెల్లింపునకు ఆమె ఈ డబ్బు తీసుకొస్తున్నట్లు వివరణ ఇచ్చారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement