సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరిగింది. జిల్లాలోని 46 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 627 నామినేషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఇందులో 618 సక్రమంగానే ఉండగా తొమ్మిదింటిని అధికారులు తిరస్కరించారు. 685 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 5,509 నామినేషన్లు రాగా వీటి లో 4,436 నామినేషన్లు పరిశీలనలో ఆ మోదం పొందాయి. వేర్వేరు కారణాల తో 1,074 ఎంపీటీసీ తిరస్కరణకు గురయ్యాయి.
జిల్లా పరిషత్ కార్యాలయం లో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డిప్యూటీ సీఈఓ కరీం, డీపీఓ ప్రభాకర్రెడ్డి జెడ్పీటీసీ నామినేషన్లను పరిశీలించారు. స్థా నిక సంస్థల ఎన్నికల పరిశీలకులు హరి ప్రీత్సింగ్ నామినేష్ల పరిశీలనను పర్యవేక్షించారు. 200 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్ల పరిశీలనకు హాజరయ్యారు. మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు ఎంపీటీసీ నామినేషన్లను పరిశీలించారు. తిరస్కరణకు గురైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై శనివారం అధికారులు అప్పీళ్లను స్వీకరిస్తారు.
తిరస్కరణకు గురైన నామినేషన్లు..
జెడ్పీటీసీ నామినేషన్లలో తొమ్మిదింటిని అధికారులు తిరస్కరించారు. ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తిరస్కరణ వివరాలు ప్రకటించారు. తొగుట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జ్యోతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన వయస్సులేకపోవటంతో, సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కె.కిష్టమ్మ రెండు నామినేషన్లను ముగ్గురు పిల్లలు ఉన్నందున, సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎర్ర యాదమ్మ పేరు ఓటరు జా బితాలో లేకపోవటంతో తిరస్కరించా రు. దుబ్బాక నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేసిన కమలమ్మ పేరును ప్రతిపాదించిన వ్యక్తిఓటు ఓటరు జాబి తాలో లేదు.
దీంతో ఆమె నామినేషన్ తిరస్కరించారు. పటాన్చెరు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరికి ముగ్గురు పిల్లలు ఉన్న ట్టు ఫిర్యాదు రావడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. కంగ్టి నుంచి నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు సంజీవ కానిస్టేబుల్గా పనిచేస్తుండడం తో నామినేషన్ తొలగించారు. మెదక్ నుంచి సీపీఎం తరఫున నామినేషన్ వేసిన బాలమ్మ పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. కోహీర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నజీమా సుల్తానా డిపాజిట్ చెల్లించకపోవడంతో అధికారులు నామినేషన్ను తిరస్కరించారు.
జెడ్పీటీసీకి 618 నామినేషన్లు ఓకే
Published Sat, Mar 22 2014 12:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement