తెలంగాణలో ఎన్నికలకు 90 వేల మంది భద్రత | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఎన్నికలకు 90 వేల మంది భద్రత

Published Tue, Apr 29 2014 5:58 PM

90,000 security personnel deployed for Telangana polls

హైదరాబాద్: తెలంగాణలో బుధవారం జరిగే శాసన సభ, లోక్సభ ఎన్నికలకు 90 వేల మంది భద్రత సిబ్బందిని మోహరించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహిస్తామని డీజీపీ ప్రసాదరావు చెప్పారు.

తెలంగాణలో 17 లోక్సభ, 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 54 వేల మంది పోలీసులతో పాటు 15, 500 హోమ్ గార్డులు, 158 పారామిలటరీ కంపెనీలు, 59 ఏపీఎస్పీ కంపెనీల సిబ్బంది భద్రత విధుల్లో నిమగ్నమయ్యారు. భారత వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్లను మోహరించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement