సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ మంత్రి సునీతారెడ్డి సీటుకు సీపీఐ ఎసరు పెట్టింది. ఆమె సొంత నియోజకవర్గమైన నర్సాపూర్ను పొత్తులో భాగంగా ఈసారి తమకు ఇవ్వాలని సీపీఐ కోరింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర సమితి ప్రతిపాదించగా.. కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సునీతారెడ్డి తన స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తున్నందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ అధిష్టానం మెదక్ పార్లమెంటు స్థానాన్ని ఆఫర్ చేయగా.. ఆమె నిరాకరించినట్లు ఢిల్లీ నుంచి అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది.
పొత్తులపై స్పష్టత...
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తులపై ఒక స్పష్టత వచ్చినట్టు సమాచారం. ఈ రెండు పార్టీల రాష్ట్ర నేతల మధ్య సోమవారం జరిగిన పొత్తులు, సీట్ల సర్దుబాటు చర్చలు అర్థవంతంగానే ముగిసినట్లు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా సమర్థించిన ఈ రెండు జాతీయ పార్టీల మధ్య మొదటి నుంచి భావసారూప్యత ఉంది. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వీరికి ఉమ్మడి శత్రువు. రెండు పార్టీలు జత కట్టడం ద్వారా తెలంగాణ సానుకూల ఓటును ఒడిసి పట్టుకోవచ్చని నాయకుల భావన.
సీట్ల పంపకాలలో పెద్దగా పేచీలు లేవని, పొత్తు దాదాపు ఖాయమని, ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సీపీఐ 22 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంటు సీట్లను కోరగా... కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ పొత్తుల కమిటీతో నారాయణ బృందం చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు కొలిక్కి రానట్లు తెలిసింది. నర్సాపూర్ నియోజకవర్గం మొదటి నుంచి సీపీఐ పార్టీకి మంచి పట్టుంది. ఇక్కడ ఆ పార్టీ నుంచి చిలుముల విఠల్రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 1999, 2004లో రెండు సార్లు విఠల్రెడ్డి మీద, 2009 ఆయన కుమారుడు కిషన్రెడ్డి మీద సునీతారెడ్డి విజయం సాధించారు.
ఈసారి కూడా ఆమె గెలుపు ధీమాతోనే ఉన్నారు. కాగా నర్సాపూర్ సీటు తమకే ఇవ్వాలని సీపీఐ కోరటంతో కాంగ్రెస్ పార్టీ సునీతారెడ్డిని ఒప్పించే పనిలో పడ్డట్టు తెలిసింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ ఆమెతో మాట్లాడినట్లు తెలిసింది. మెదక్ పార్లమెంటు నుంచి పోటీచేయాలని ఆయన సూచించగా... సునీతారెడ్డి నిరాకరించినట్లు తెలిసింది. పటాన్చెరు సీటు కూడా అడగాలని సీపీఐ జిల్లా నాయకత్వం కోరినప్పటికీ రాష్ట్ర నాయకులు అంతగా ఆసక్తి చూపనట్లు సమాచారం. పార్టీకి బలం లేని చోట సీటు కోరి ఓడిపోవడం ఎందుకని రాష్ట్ర నాయకులు అన్నట్లు సమాచారం.
ఆత్మరక్షణలో సునీతారెడ్డి..
సొంత నియోజకవర్గం పొత్తుల పాలు కావడంతో సునీతారెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. ఒకవేళ సీటు తనకు దక్కకపోతే భవిష్యత్తు కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తమ పార్టీలోకి రావాలని ఇప్పటికే ఆమెకు టీఆర్ఎస్ ఆహ్వానం పంపినట్టు వార్తలు వచ్చిన విషయం విదితమే. ఆమె కూడా పార్టీ మారుతున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. అయితే సునీతారెడ్డి మాత్రం మీడియా ముందుకు వచ్చి తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇంతలోనే అనూహ్యంగా సీపీఐతో పొత్తులు తెరమీదకు రావడం, వాళ్లు నర్సాపూర్ కోసమే పట్టుబట్టడంతో మళ్లీ ఆమె ఆత్మరక్షణలో పడ్డారు.
పొత్తు.. సీటు చిత్తు!
Published Mon, Mar 24 2014 11:45 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement