ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు బీజేపీ బలం.. కేవలం పది లోక్సభ స్థానాలు. మరిప్పుడో.. ఏకంగా 73 సీట్లు. ఆ రాష్ట్రంలో ఉన్న బలమైన ప్రాంతీయ శక్తులు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా తుడిచిపెట్టేసి భారీ సంఖ్యలో ఎంపీ సీట్లను గెలుచుకుంది. యూపీ దక్కితే కేంద్రంలో అధికారం చేజిక్కినట్లేనని చెబుతారు. అలాంటి యూపీని బీజేపీ గెలుచుకోవడానికి కారణం ఎవరు? నరేంద్రమోడీ మ్యాజిక్ ఒక్కటే అంతపని చేసిందా? సం'కుల' సమరం సాగుతుండే ఉత్తరప్రదేశ్లో దాదాపు 11 నెలల పాటు ముమ్మరంగా కసరత్తు చేసి, తనకు ఎదురైన అవమానాలు, పరాభవాలను కూడా అవకాశాలుగా మలచుకుని, 73 ఎంపీ సీట్లను పళ్లెంలో పెట్టి నరేంద్రమోడీకి అప్పగించిన ఘనత గుజరాత్ మంత్రి అమిత్షాకే దక్కుతుంది. ఇప్పటివరకు యూపీలో బీజేపీకి గరిష్ఠంగా దక్కిన స్థానాలు.. 57 మాత్రమే. అదీ 1998లో. కానీ ఇప్పుడు ఏకంగా 91% స్థానాలను దక్కించుకుంది. దానివల్లే జాతీయస్థాయిలో 280కి పైగా సీట్లు సాధించగలిగింది.
కులమతాల కుమ్ములాటలు ఎప్పుడూ జరుగుతుండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమిత్షా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 నెలల పాటు మకాం వేశారు. ఆయనను గుజరాత్ రాష్ట్రంలో ఉండొద్దని కోర్టు ఆదేశించినప్పుడు దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన బాస్ మోడీ ఆదేశాలతో వెంటనే ఉత్తరప్రదేశ్ వెళ్లిపోయి, అక్కడ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా అంచనా వేశారు.
యూపీలో ప్రధానంగా ముస్లింలు, జతావాలు, యాదవులు కలిసి దాదాపు 41 శాతం వరకు ఉంటారు. వీళ్లంతా ఇన్నాళ్ల బట్టి బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలో అధికారం లేదు. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు గట్టిగా ప్రచారం చేయడానికి కరిష్మా ఉన్న నాయకుడు కూడా ఎవరూ లేరు. కళ్యాణ్ సింగ్ లాంటి నాయకులు అప్పటికే వయసు మీరడంతో పాటు వాళ్లకు మాస్ అప్పీల్ లేదు. మరోవైపు మాయావతి లాంటి నాయకులు ఉధృతంగా ప్రచారం చేస్తారు. ఇన్ని ప్రతికూలాంశాలను తట్టుకోవాలంటే ఏం చేయాలో పక్కా వ్యూహాన్ని రూపొందించుకున్నారు అమిత్ షా. ఇన్నాళ్లుగా తమకు మద్దతు ఇవ్వని వర్గాల వద్దకు ఇంటింటికీ వెళ్లి వాళ్లకు నచ్చజెప్పారు. రాష్ట్రంలో మొత్తం 450 ర్యాలీలు నిర్వహించారు. ఇందుకోసం 450 వీడియో రథాలు ఉపయోగించి వాటిద్వారా నరేంద్రమోడీ ప్రసంగాలను అన్నిచోట్లా వినిపించారు.
కులసంఘాల పెద్దలందరితో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ మంచి చేసుకున్నారు. దాదాపు పుష్కర కాలం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ కూడా చేయకపోవడంతో దూరమైన ప్రజలందరినీ మళ్లీ దగ్గరకు తెచ్చుకున్నారు. లక్ష్యం సాధించారు. 80 సీట్లకు గాను 73 స్థానాల్లో పాగా వేసి మోడీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
యూపీ విజయం వెనుక ఏమా మంత్రదండం?
Published Mon, May 19 2014 11:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement